News December 24, 2025
సంగారెడ్డి: పీఎంశ్రీ పాఠశాలల్లో ‘బాలల రక్షణ’ అవగాహన

సంగారెడ్డి జిల్లాలోని 44 పీఎంశ్రీ పాఠశాలల్లో జనవరి 8 నుంచి 23 వరకు బాలల సంరక్షణ, భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి తెలిపారు. విద్యార్థుల భద్రతే ధ్యేయంగా ప్రతిరోజూ వైవిధ్య భరిత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు తమ హక్కులు, రక్షణ చట్టాలు, ఆపద సమయంలో ఆదుకునే టోల్ ఫ్రీ నంబర్లపై సమగ్ర అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.
Similar News
News December 25, 2025
NCERT 173 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 25, 2025
తిరుమల క్షేత్రపాలుడిగా పరమశివుడు

తిరుమల కేవలం వైష్ణవ క్షేత్రమే కాదు. శైవ సామరస్యానికి వేదిక కూడా! శ్రీవారు ఇక్కడ కొలువై ఉంటే, ఆయనకు రక్షకుడిగా, క్షేత్రపాలుడిగా పరమశివుడు ‘రుద్రుడి’ రూపంలో కొలువై ఉంటారు. తిరుమల కొండపై ఉన్న ‘గోగర్భ తీర్థం’ వద్ద శివుడు క్షేత్రపాలకత్వ బాధ్యతలు నిర్వహిస్తారట. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు క్షేత్రపాలుడిని కూడా స్మరించుకోవడం ఆచారంగా వస్తోంది. హరిహరుల మధ్య భేదం లేదని ఈ క్షేత్రం చాటిచెబుతోంది.
News December 25, 2025
విశాఖ స్టీల్ ప్లాంటులో మూడో విడత VRS

AP: విశాఖ స్టీల్ ప్లాంట్లో 3వ విడత VRSకు యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది. 2027 JAN 1 తర్వాత పదవీ విరమణకు అర్హులయ్యే ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. 15ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని 45ఏళ్లు దాటిన ఉద్యోగులను అర్హులుగా పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో తొలిసారి 1,146, రెండోసారి 487 మంది VRSకు అంగీకరించారు. ఈసారి 570 మందికి వీఆర్ఎస్ ఇవ్వాలనే లక్ష్యంతో నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


