News August 16, 2025
సంగారెడ్డి: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాను రెడ్ అలర్ట్గా వాతావరణ శాఖ ప్రకటించినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దని అన్నారు. ప్రజలు వాగులు, చెరువులు, కుంటల దగ్గరికి వెళ్లకూడదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.
Similar News
News August 17, 2025
NZB: ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

NZB నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందారు. దీంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టాయి. ఆర్మూర్కు చెందిన సాయికుమార్(26) రోడ్డు ప్రమాదంలో గాయపడగా చేతికి కాలుకు గాయమైందని చెప్పి హాస్పిటల్ వర్గాలు చేర్చుకుని ట్రీట్మెంట్ ప్రారంభించాయని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యం చేస్తుండగా సాయికుమార్ మరణించాడని తెలపడంతో బంధువులు ఆందోళన చేపట్టారు.
News August 17, 2025
మంథనిలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు

మంథని పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి ఉత్సావాల మధ్య శనివారం ఘనంగా జరిగాయి. రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, కోదండరామాలయాల్లో వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు జరిగి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. “కృష్ణుడు అవతరించింది చెడును అంతమొందించి ధర్మాన్ని స్థాపించేందుకే” అని భక్తులు పేర్కొన్నారు. చిన్నారులు రాధాకృష్ణ వేషధారణలో పాల్గొని కనువిందు చేయగా, పట్టణం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
News August 17, 2025
తిరుమలలో క్యూలైన్లను పరిశీలించిన ఎస్పీ

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు క్యూలైన్ల వద్దకు చేరుకుని క్యూలైన్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.