News April 21, 2025

సంగారెడ్డి: ప్రజావాణిలో 63 ఫిర్యాదులు

image

కలెక్టరేట్ లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 63 మంది తమ సమస్యలను అదనపు కలెక్టర్‌కు విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

Similar News

News December 23, 2025

30 దేశాల్లో అమెరికా రాయబారుల తొలగింపు

image

30 దేశాల్లోని తమ రాయబారులను తొలగిస్తూ US అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. వీరంతా బైడెన్‌ హయాంలో నియమించిన వారు కావడం విశేషం. అధ్యక్షుడు ట్రంప్ ఎజెండా(అమెరికా ఫస్ట్)కు అనుగుణంగా పని చేసే ఉద్దేశంతో వీరి స్థానంలో కొత్తవారిని నియమించనున్నట్లు అధికారులు తెలిపారు. తొలగించినవారిలో నేపాల్, శ్రీలంక, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్ తదితర దేశాల రాయబారులున్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో పలు ఒప్పందాలు మారనున్నాయి.

News December 23, 2025

వారు ఆ టైంలోనే తిరుమలకు రావాలి: BR నాయుడు

image

AP: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తామని TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. ‘DEC 30 నుంచి JAN 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నాం. 10 రోజులలో మొత్తం 182గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్యులకే కేటాయించాం. ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన వారు తప్పనిసరిగా నిర్దేశిత తేదీ, టైంలోనే తిరుమలకు చేరుకోవాలి. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు తదితర ఏర్పాట్లు చేశాం’ అని తెలిపారు.

News December 23, 2025

ఉష్ణోగ్రత ఎంత ఉంటే.. చలి అంత ఉన్నట్టా?

image

ఉష్ణోగ్రత ఎంత తగ్గితే చలి తీవ్రత అంత ఎక్కువ అవుతుందనేది ఒకింత నిజమే. అయితే టెంపరేచర్ ఒక్కటే చలిని నిర్ణయించదు. వాతావరణంలోని తేమ, ఎండ.. ముఖ్యంగా గాలి వేగం ప్రభావితం చేస్తాయి. థర్మామీటర్ చూపే ఉష్ణోగ్రత కంటే గాలి వేగం ఎక్కువగా ఉంటే శరీరం నుంచి వేడి త్వరగా పోయి మరింత చల్లగా అనిపిస్తుంది. ఉదాహరణకు గాలి లేకుండా 0°C ఉంటే చల్లగా ఉంటుంది. అదే 0°Cకి 40kmph గాలి కలిస్తే -10°C లాగా అనిపిస్తుంది.