News February 11, 2025

సంగారెడ్డి: బీసీ స్టడీ సర్కిల్‌లో 12 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

బీసీ స్టడీ సర్కిల్‌లో ఆర్ఆర్ బీ, ఎస్ఎస్సీ, ఉచిత శిక్షణ కోసం 181 మంది దరఖాస్తు చేసుకున్నారని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ మంగళవారం తెలిపారు. వీరిలో ఇంటర్, డిగ్రీలో మెరిట్ ఆధారంగా 100 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. 12 నుంచి 14వ తేదీ వరకు స్టడీ సర్కిల్‌లో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని చెప్పారు. 15 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. SHARE IT..

Similar News

News September 16, 2025

గన్నవరం ఎయిర్ పోర్టులో రేపు ప్రయాణికులకు గ్రాండ్ వెల్కం

image

గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్బంగా యాత్రిసేవా దివస్‌ను బుధవారం నిర్వహించబోతున్నారు. ప్రయాణికులకు క్వాలిటీ సర్వీసెస్‌ అందించడంలో భాగంగా వారికి గ్రాండ్‌గా వెల్కం చేయడం, వైద్య పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు ఎయిర్‌పోర్టు చూపించడం, ఏవియేషన్ రంగంలో ఉద్యోగావకాశాల కల్పనపై తరగతులు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని చర్యలు తీసుకోనున్నారు.

News September 16, 2025

భార్య చివరి కోరిక నెరవేర్చిన భర్త

image

AP: తనను ఉపాధ్యాయుడిగా చూడాలన్న భార్య చివరి కోరికను తీర్చాడు భర్త. ఎన్టీఆర్(D) రెడ్డికుంటకు చెందిన రామకృష్ణ భార్య ఏడాది క్రితం డెంగీతో మరణించారు. ఇటీవల ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్‌(బయాలజీ)గా DSCలో ఎంపికయ్యారు. ఆమె చివరి కోరికను తీర్చడానికి రోజుకు 10 గంటలకు పైగా చదివినట్లు రామకృష్ణ తెలిపారు. తన భార్య బతికి ఉంటే సంతోషించేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

News September 16, 2025

ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈనెల 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించి, ప్రజా పాలన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.