News March 7, 2025
సంగారెడ్డి: మహిళలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి: జిల్లా జడ్జి

మహిళలు సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని జిల్లా జడ్జి భవాని చంద్ర అన్నారు. సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళల పాత్ర గొప్పదని చెప్పారు. నేటి సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు గౌరవం పొందుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Similar News
News April 5, 2026
వరంగల్ మార్కెట్ రేపు పున: ప్రారంభం

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. శుక్రవారం గుడ్ ఫ్రైడే, శని, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News April 5, 2026
ఖానాపూర్: బీజేపీ ఛైర్ పర్సన్.. బీఆర్ఎస్ వైస్ ఛైర్మన్

ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఛైర్మన్ పదవిని బీజేపీ దక్కించుకోగా, వైస్ ఛైర్మన్ పదవి బీఆర్ఎస్కు దక్కింది. ఛైర్మన్గా బీజేపీకి చెందిన అంకం మౌనిక, వైస్ ఛైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ మహమ్మద్ షోహెబ్ ఎన్నికయ్యారు. రాజకీయ సమీకరణాల మధ్య సాగిన ఈ ఎన్నిక ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. నూతన పాలకవర్గానికి పలువురు నేతలు అభినందనలు తెలిపారు.
News April 5, 2026
MIకి శుభవార్త.. కోలుకున్న హార్దిక్!

అనారోగ్యం కారణంగా DCతో మ్యాచ్కు దూరమైన MI కెప్టెన్ హార్దిక్ కోలుకున్నట్లు సమాచారం. ఎల్లుండి రాజస్థాన్ రాయల్స్తో జరగనున్న మ్యాచ్లో ఆయన ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా KKRపై గెలిచిన ముంబై నిన్న DC చేతిలో ఓడిన విషయం తెలిసిందే.


