News March 29, 2025
సంగారెడ్డి: ముగ్గురు పిల్లలు మృతి.. భర్త అనుమానమే కారణమా?

SRD జిల్లా అమీన్పూర్లో ముగ్గురు పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. RR జిల్లా తలకొండపల్లి(M)కి చెందిన చెన్నయ్య 2012లో NLG జిల్లా మందాపూర్ వాసి రజితను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమెపై అనుమానంతో చెన్నయ్య వేధించేవాడు. దీంతో పట్టింటికి వెళ్లింది. పెద్దలు చెప్పడంతో భర్త దగ్గరికి వచ్చింది. మళ్లీ వేధిస్తే పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటానని అప్పట్లోనే రజిత హెచ్చరించినట్లు తెలిసింది.
Similar News
News September 17, 2025
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్

మాచర్లలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం చేశారు. పర్యటనను విజయవంతం చేయడానికి వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని, అందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.
News September 17, 2025
VKB: స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్

వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెగా హెల్త్ క్యాంప్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. మహిళల ఆరోగ్యం బలపడితే కుటుంబం బలపడుతుందని, శిబిరం ద్వారా మహిళలకు, పిల్లలకు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలు అందించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
News September 17, 2025
రేపు భారీ వర్షాలు

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.