News October 26, 2025
సంగారెడ్డి: యువకుడిపై ఫోక్స్ కేసు నమోదు

కల్హేర్ మండలం రాపర్తి గ్రామానికి చెందిన కస్ప సంతోష్పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు కంగ్టి సీఐ వెంకటరెడ్డి శనివారం తెలిపారు. రెండు నెలల క్రితం కల్హేర్లో అతని మేన మామ వద్ద ఉంటూ ఓ బాలికను ఎత్తుకెళ్లాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.
Similar News
News October 26, 2025
TU: డిగ్రీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని డిగ్రీ (B.A/B.Com/B.Sc/BBA/BCA) 1, 3, 5 సెమిస్టర్ల విద్యార్థులు తమ పరీక్షల ఫీజులు చెల్లించడానికి గడువు తేదీ పొడిగింపు చేసినట్లు COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. నవంబర్ 4వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా సంబంధిత కళాశాలల్లో పరీక్ష ఫీజులు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
News October 26, 2025
తాండూరు: ‘ఈనెల 30వరకు అడ్మిషన్లకు అవకాశం’

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓపెన్ పదో తరగతి, ఇంటర్ అడ్మిషన్స్కు ఈనెల 30వరకు అవకాశం ఉందని, వివిధ కారణాలతో మధ్యలో చదువు మానేసినవారు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాండూరు నంబర్ వన్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శివకుమార్ తెలిపారు. అడ్మిషన్ల పూర్తి వివరాలకు పాఠశాల ఓపెన్ స్కూల్ ఇన్ఛార్జ్ మహేష్ను సంప్రదించాలని ఆయన సూచించారు.
News October 26, 2025
ఉమ్మడి విశాఖలో రూ.220 కోట్ల బకాయిలు

జిల్లా గ్రంథాలయ సంస్థకు ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థలు రూ.220 కోట్లు సెస్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 67 గ్రంథాలయాలు ఉన్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలు, జీవీఎంసీ వసూలు చేసే ఇంటి పన్నుల్లో గ్రంథాలయ సెస్ కూడా ఉంటుంది. జీవీఎంసీ రూ.200 కోట్లు పైగా చెల్లించాల్సి ఉంది. సెస్ బకాయిల వసూళ్లకు కృషి చేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రాజా తెలిపారు.


