News March 19, 2025

సంగారెడ్డి యువతకు GOOD NEWS

image

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో సంగారెడ్డి జిల్లాలోని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలో 7.20 లక్షల మంది యువత ఉన్నారు. ఏప్రిల్ 5 వరకు http:///tgobmmsnew.cgg.gov.in లో అప్లై చేసుకుంటే జూన్ 2 అర్హుల తుది జాబితా ప్రకటిస్తారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలో వెల్లడించనున్నారు. ఎంచుకునే యూనిట్‌ని బట్టి రూ.3 లక్షల వరకు ఇవ్వనున్నారు.

Similar News

News March 19, 2025

ఈ నగరాల్లో జీవనం కాస్ట్లీ గురూ!

image

ఇండియాలోని బెంగళూరులో జీవించడం చాలా కాస్ట్లీ అని ఓ అధ్యయనంలో వెల్లడైంది. నగరాలు అక్కడి ఖర్చులను పోల్చుతూ నెలకు ఎంత డబ్బు అవసరం అవుతుందో తెలిపింది. బెంగళూరులో నివసించేందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నెలకు ₹35,887 అవసరమని పేర్కొంది. ముంబైలో ₹33,321, ఢిల్లీలో ₹33,308, పుణేలో ₹32,306, HYDలో ₹31,253, అహ్మదాబాద్‌లో ₹31,048, చెన్నైలో ₹29,276 అవసరం. కాగా వ్యక్తుల అవసరాలను బట్టి ఇందులో మార్పులుండొచ్చు.

News March 19, 2025

ఐపీఎల్‌లో రాణిస్తే టెస్టుల్లో చోటు ఎలా?: అశ్విన్

image

ఆటగాళ్ల ప్రదర్శనను ఆయా ఫార్మాట్ల వారీగా పరిగణనలోకి తీసుకోవాలని అశ్విన్ అన్నారు. ‘T20ల్లో రాణిస్తే ODI/టెస్టులకు, టెస్టుల్లో రాణిస్తే T20లకు తీసుకోవాలని జనం అంటుంటారు. ఇది కరెక్ట్ కాదు. IPLలో రాణిస్తే T20Iకు మాత్రమే తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. శ్రేయస్ గురించి మాట్లాడుతూ ‘IPLలో కెప్టెన్‌గా రాణిస్తే టెస్టుల్లో చోటు ఎలా దక్కుతుంది? CTలో అతను బాగా ఆడాడు. IPLలోనూ రాణిస్తాడు’ అని పేర్కొన్నారు.

News March 19, 2025

వేసవిలో కూల్ వాటర్ తాగుతున్నారా?

image

వేసవిలో రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన నీటిని తాగవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండవేడికి తాళలేక చల్లగా ఉన్న నీటిని తాగితే శరీరం వాటిని తీసుకోలేదు. దీంతో తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి. జీర్ణాశయం పనితీరు నెమ్మదించి మలబద్ధకం, అజీర్తి సమస్యలు ఏర్పడుతాయి. ఎండ నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీరు తాగితే జలుబు, గొంతు మంట వచ్చే అవకాశముంది. దంతాలు దెబ్బతినే ఛాన్స్ ఉంది. మట్టికుండలోని నీరు తాగడం ఉత్తమం.

error: Content is protected !!