News April 7, 2025
సంగారెడ్డి: యువతి అదృశ్యం.. కేసు నమోదు

యువతి అదృశ్యమైన ఘటన పుల్కల్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ తెలిపిన వివరాలు.. పుల్కల్ గ్రామానికి చెందిన ఓ యువతి (20) ఆదివారం ఉదయం నాలుగు గంటలకు అందరూ నిద్రిస్తుండగా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్లో యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News April 10, 2025
ADB: తులం బంగారం కోసం పెళ్లి పందిరిలో నిరసన

రాష్ట్ర ప్రభుత్వం నవ వధువుకు అందించే తులం బంగారం ఏదంటూ ఏకంగా ఓ పెళ్లి పందిరి లోనే నవ దంపతులు నిరసన వ్యక్తం చేసిన వినూత్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం ముఖరా(కే)లో గురువారం జరిగిన పెళ్లిలో నవ దంపతులు కాంబ్లె ఆమోల్ – గీతాంజలి ప్లకార్డులతో నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి గారు.. తులం బంగారం ఎక్కడ అంటూ మాట్లాడారు.
News April 10, 2025
దెందులూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

దెందులూరు మండలం కొమరేపల్లి జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని, స్విఫ్ట్ డిజైర్ కార్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఒకరు మృతి చెందగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ధర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 10, 2025
ADB: తులం బంగారం కోసం పెళ్లి పందిరిలో నిరసన

రాష్ట్ర ప్రభుత్వం నవ వధువుకు అందించే తులం బంగారం ఏదంటూ ఏకంగా ఓ పెళ్లి పందిరి లోనే నవ దంపతులు నిరసన వ్యక్తం చేసిన వినూత్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం ముఖరా(కే)లో గురువారం జరిగిన పెళ్లిలో నవ దంపతులు కాంబ్లె ఆమోల్ – గీతాంజలి ప్లకార్డులతో నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి గారు.. తులం బంగారం ఎక్కడ అంటూ మాట్లాడారు.