News January 2, 2026

సంగారెడ్డి: ‘యూరియా కోసం ఆందోళన చెందవద్దు’

image

జిల్లాలో సరిపడా యూరియా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ గురువారం తెలిపారు. జిల్లాలో 4,441 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. దశలవారీగా రైతులకు యూరియాను అందిస్తామని పేర్కొన్నారు. రైతులు అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలని కోరారు.

Similar News

News January 4, 2026

దర్శకుడికి అనారోగ్యం.. ఐసీయూలో చికిత్స

image

ప్రముఖ దర్శకుడు భారతీరాజా అనారోగ్యంతో చెన్నైలోని MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతనెల 27న శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్న ఆయనను కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ICUలో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం రాజా ఆరోగ్యం నిలకడగా ఉందని, ట్రీట్‌‌మెంట్‌కు స్పందిస్తున్నారని వైద్యులు బులెటిన్ రిలీజ్ చేశారు. కాగా అంతకుముందు భారతీరాజా మరణించారంటూ SMలో తప్పుడు ప్రచారం జరిగింది.

News January 4, 2026

మీ పిల్లలకు కాల్షియం లోపం రాకుండా ఇవి తినిపించండి

image

పిల్లల్లో కాల్షియం లోపం రాకుండా చూసుకోవాలి. ఎముకలు, దంతాల బలానికి ఇది చాలా అవసరం. అందుకే ఆహారంలో పాలు, పెరుగు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులు తప్పనిసరిగా ఉండాలి. పాలకూర, తోటకూర, మునగాకు వంటి ఆకుకూరలు, నల్ల నువ్వులు, బాదం, రాగి జావ, రాగి లడ్డూలు, గుడ్లు, చేపలు కూడా ఎంతో మేలు చేస్తాయి. కాల్షియాన్ని శరీరం గ్రహించాలంటే విటమిన్-D చాలా అవసరం. అందుకే పిల్లలను ప్రతిరోజూ ఉదయం కాసేపు ఎండలో ఆడుకోనివ్వాలి.

News January 4, 2026

జనగామ: 3 నియోజకవర్గాలు.. 155మంది ఆశావహులు

image

కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఏర్పాటుకై డీసీసీ ప్రెసిడెంట్ లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం దరఖాస్తులు స్వీకరించారు. జనగామలో జరిగిన ఈ స్వీకరణలో మూడు నియోజకవర్గాల నుంచి మొత్తం 155మంది ఆశావహులు అప్లికేషన్లు ఇచ్చారు. విత్తన అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బైకానీ లింగం యాదవ్ పాల్గొన్నారు.