News February 12, 2025
సంగారెడ్డి: రేపు ఆంగ్ల భాషా దినోత్సవం నిర్వహించాలి: డీఈవో

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలో రేపు సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా ఆంగ్ల భాషా దినోత్సవం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాలలో 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించాలని సూచించారు.
Similar News
News December 22, 2025
ఖమ్మం జిల్లాలో రూ.68కోట్లకు పైగా బోనస్: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 331 కొనుగోలు కేంద్రాల ద్వారా 43,236 మంది రైతుల నుంచి 2,51,847 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 90 శాతం రైతులకు రూ.530 కోట్లకు పైగా చెల్లింపులు చేశామని చెప్పారు. సన్న వడ్లకు రూ.68 కోట్లకు పైగా బోనస్ అందించామన్నారు.
News December 22, 2025
బంగ్లాదేశ్లో హిందువుల జనాభా ఎంతంటే?

బంగ్లాదేశ్లో హిందువులపై ఈ మధ్య దాడులు పెరిగాయి. ఇటీవల దీపూ చంద్రదాస్ హత్యతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. భారత ప్రభుత్వం సైతం దీన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ హిందువుల జనాభా ఎంతనే చర్చ జరుగుతోంది. బంగ్లా 2022 సెన్సస్ ప్రకారం ఆ దేశంలో దాదాపు 1.3 కోట్ల మంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. ఇది ఆ దేశ మొత్తం జనాభాలో 8%. భారత్, నేపాల్ తర్వాత అత్యధిక మంది హిందువులున్నది బంగ్లాలోనే.
News December 22, 2025
కుష్టు వ్యాధి సర్వేను పరిశీలించిన భద్రాద్రి DM&HO

జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డా.తుకారామ్ రాథోడ్ బూర్గంపాడు, గౌతమ్ పూర్ గ్రామాల్లో జరుగుతున్న కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమ సర్వేను పరిశీలించారు. బూర్గంపాడు జూనియర్ కళాశాలలో జరిగిన జాతీయ విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్ కార్యక్రమంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను పరిశీలించారు. ఈ వైద్య శిబిరాల్లో మొరంపల్లి బంజర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


