News March 1, 2026

సంగారెడ్డి: రేపు ప్రజావాణి కార్యక్రమం

image

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.

Similar News

News March 2, 2026

అనకాపల్లి: కలెక్టర్‌ను కలిసిన మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు

image

నక్కపల్లిలో అర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ సీఈవో దిలీప్ ఒమెన్, ప్రాజెక్ట్ చీఫ్ కేఎల్ చౌదరి, హెచ్ఆర్ డైరెక్టర్ అశుతోష్ సోమవారం కలెక్టర్ విజయ కృష్ణన్‌ను కలిశారు. నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆమెతో చర్చించారు. భూ సమీకరణ, పునరావాస కాలనీల అభివృద్ధి, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, నీటి సరఫరా కోసం పైప్ లైన్ల నిర్మాణం తదితర అంశాలపై కలెక్టర్ వారితో సమీక్షించారు.

News March 2, 2026

అర్జీల పట్ల నిర్లక్ష్యం తగదు: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లా కలెక్టరెట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు-128, రెవెన్యూ క్లినిక్‌కు 173 అర్జీలు వచ్చాయని కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. అర్జీదారుల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు.
భూసంబంధిత సమస్యలను రెవిన్యూ క్లినిక్ ద్వారా సత్వరమే పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రజలతో నేరుగా మాట్లాడాలని కలెక్టర్ సూచించారు.

News March 2, 2026

హోలీ శుభాకాంక్షలు తెలిపిన భూపాలపల్లి కలెక్టర్

image

రంగుల పండుగ హోలీ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ ప్రతి ఇంటా ఆనందం, ఐక్యత నింపాలని ఆకాంక్షించారు. రసాయన రంగులు ఉపయోగించకుండా సహజ రంగులతో పండుగ జరుపుకోవాలని సూచించారు. చిన్నారులు పెద్దల పర్యవేక్షణలో ఆడాలని, చెరువులు, వాగుల్లో స్నానాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. శాంతి భద్రతలు కాపాడుతూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.