News April 16, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతిచెందారు. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బాచేపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. రేగోడ్ మండలంలోని పట్టెపొలం తండాకు చెందిన లావుడియా సక్రీ బాయి, సుభాష్ బైక్పై వెళ్తున్నారు. నిజాంపేట్ మండలం బాచుపల్లి శివారులో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 15, 2025
ఇకనైనా ‘వలస’ జీవులకు విముక్తి లభించేనా?

బిహార్లో మరోసారి ఎన్డీఏ తమ ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి జీవనోపాధి పొందుతున్న లక్షలాది మంది తిరిగి తమ ఉపాధి క్షేత్రాలకు తిరిగిరానున్నారు. ఈక్రమంలో ఏళ్లు గడుస్తున్నా వలస జీవుల బతుకులు మారట్లేదని, ప్రజలకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయనే చర్చ జరుగుతోంది. స్థిరమైన ప్రభుత్వం రావడంతో ఇకనైనా కంపెనీలు నెలకొల్పి స్థానికంగా ఉపాధి కల్పించాలని సూచిస్తున్నారు.
News November 15, 2025
ఉపాధి హామీలో లక్ష్యాలు పూర్తి చేయాలి: VZM కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద రోజువారీ లక్ష్యాలను పూర్తి చేసి, ప్రతి కుటుంబానికి 100 రోజుల పనులు శాత శాతంగా అందించాల్సిన అవసరాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉపాధి పనులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్, డ్వామా పథక సంచాలకులు, ఏపీడీలు, ఏపీవోలు, ఎంపీడీవోలతో మండల వారీ పురోగతిని సమీక్షించారు. పనిదినాలు, కనీస వేతనాలు, హాజరు శాతం వంటి అంశాలపై విశ్లేశించారు.
News November 15, 2025
బాల్య వివాహాలను నిర్మూలించండి: కలెక్టర్

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం కర్నూలు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వరకట్న నిషేధం, బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించి జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో వరకట్న నిషేధంపై అధికారులు స్వచ్ఛంద సంస్థల ద్వారా నిరంతరం అవగాహన కల్పించాలన్నారు.


