News February 3, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే గన్మెన్ మృతి

రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే గన్మెన్ మృతి చెందిన ఘటన పటాన్ చెరు మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి(M) బుల్కాపూర్కు చెందిన శ్రీనివాస్(34) పటాన్ చెరు(M) ఎలిమెలలో ఆదివారం బీరప్ప జాతరకు అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. జాతర ముగించుకుని వస్తుండగా కొండకల్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 11, 2025
VKB: లగచర్ల ఘటనకు నేటికి ఏడాది

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన లగచర్ల ఘటన జరిగి నేటికి ఏడాది అవుతుంది. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్కు దుద్యాల మండలం లగచర్లతో పాటు మరో రెండు గ్రామాల్లో భూసేకరణ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. హాజరైన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి పాల్పడిన సంగతి విదితమే. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే సహా పలువురు గ్రామస్థులు అరెస్టు కావడంతో ఉద్రిక్తత కొనసాగింది.
News November 11, 2025
HNK: ఫిజియోథెరపీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హనుమకొండ జిల్లా సమగ్ర శిక్ష విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపిస్టు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకటరెడ్డి తెలిపారు. పరకాల, శాయంపేట, ఆత్మకూరు, దామెర, వేలేరు, కమలాపూర్, భీమదేవరపల్లి, నడికూడ మండలాల్లో తాత్కాలిక నియామకాలు చేపడతారు. ఈ నెల 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
News November 11, 2025
కొమ్ములవంచలో కత్తిపోట్ల కలకలం

కొడుకును పొడుస్తున్నాడని అడ్డుకున్న తల్లిని కత్తితో పొడిచిన ఘటన MHBD జిల్లాలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నర్సింహులపేట(M) కొమ్ములవంచ గ్రామంలో బూరుగండ్ల రవికి పారునంది అర్జున్లకు మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ క్రమంలో రవిని కత్తితో అర్జున్ను పొడుస్తుండగా అడ్డుకోబోయిన అతడి తల్లి సునీతను చేయి దగ్గర పొడిచాడు. వారిని 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


