News January 4, 2026

సంగారెడ్డి: లంచం అడిగితే సమాచారం ఇవ్వండి: ఏసీబీ డీఎస్పీ

image

సమాజంలో అవినీతి ఒక పెద్ద సమస్యగా మారిందని, దానిని అరికట్టే శక్తి ప్రజల చేతుల్లోనే ఉందని ఉమ్మడి మెదక్ ఏసీబీ డీఎస్పీ సుధాకర్ పేర్కొన్నారు. లంచం అడగడం, తీసుకోవడం, ఇవ్వడం కూడా నేరమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారి ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

Similar News

News January 7, 2026

ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: భద్రాద్రి కలెక్టర్

image

భద్రాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణను అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని ఆయన వీసీ ద్వారా నిర్వహించారు. రహదారుల భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వినూత్న కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు.

News January 7, 2026

ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: కొప్పుల ఈశ్వర్

image

జగిత్యాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాల క్రితం తమ చేతుల మీదగా ప్రారంభించిన ఎస్సీ స్టడీ సర్కిల్ కేంద్రాన్ని బుధవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కేసీఆర్ పాలనలో స్టడీ సర్కిల్ కేంద్రాలు విజయవంతంగా నడిచాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకోవడంలేదని విమర్శించారు. గతంలో స్టడీ సర్కిల్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ఎంతో కృషి చేశాయని అన్నారు.

News January 7, 2026

పాలమూరు: ట్రాక్టర్ రూటర్ కిందపడి బాలుడి మృతి

image

NGKL జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన దుడ్డు మల్లేష్ కుమారుడు మిట్టు(3)ను పొలానికి తీసుకుని పొలానికి తీసుకెళ్లగా, అక్కడ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రూటర్ టైర్ కిందపడి మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బాలుడి మరణాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.