News March 1, 2025
సంగారెడ్డి: వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

సంగారెడ్డి జిల్లాలో నిన్న జరిగిన వేర్వేరు ప్రమాదంల్లో ముగ్గురు చనిపోయారు. సదాశివపేటలో వాటర్ ట్యాంకర్ను స్కూటీ ఢీకొన్న ఘటనలో <<15608397>>ఇంటర్ విద్యార్థి<<>> సాయికార్తీక్ మృతిచెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పొట్టిపల్లికి చెందిన సతీశ్(29) కుటుంబ కలహాలతో సూసైడ్ చేసుకున్నాడు. జిన్నారం మం. కాజిపల్లి శివారులో క్వారీ కూలి హిటాచీ డ్రైవర్ శ్రీనివాస్(30) మృతి చెందాడు.
Similar News
News March 1, 2025
ఎల్కతుర్తి: క్రేన్ తగిలి తండ్రి, కొడుకు స్పాట్ డెడ్

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రేన్ తగిలి తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతులు కోతులనడుమ గ్రామానికి చెందిన రాజేశ్వర్ రావు, వికాస్గా గుర్తించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 1, 2025
సెమీఫైనల్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ షార్ట్ సెమీస్లో ఆడేది అనుమానమేనని కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పారు. షార్ట్ గాయంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అతని స్థానంలో మెక్ గుర్క్, అరోన్, కూపర్లలో ఒకరిని తీసుకుంటామని చెప్పారు. నిన్న వర్షం కారణంగా రద్దైన మ్యాచులో షార్ట్ 15 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యారు.
News March 1, 2025
100 రోజుల్లోపే శిక్ష పడేలా పనిచేయాలి: హోంమంత్రి అనిత

AP: నేరం చేసిన వంద రోజుల్లోపే శిక్షలు పడేలా పనిచేయాలని ట్రైనింగ్ పూర్తి చేసుకున్న SIలకు హోంమంత్రి అనిత సూచించారు. నిజాయితీగా ప్రజల రక్షణకు ముందుకెళ్లాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైల పాసింగ్ పరేడ్లో ఆమె పాల్గొన్నారు. మొత్తం 395 మంది ఎస్సైలుగా శిక్షణ పూర్తి చేసుకోగా వీరిలో 97 మంది మహిళలు ఉన్నారు. మహిళలు ఇంత సంఖ్యలో ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ పరేడ్కు డీజీపీ హరీశ్ గుప్తా హాజరయ్యారు.