News March 5, 2025
సంగారెడ్డి: వేసవి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి: కలెక్టర్

వేసవిలో మంచినీటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవిలో మంచినీటి సమస్య లేకుండా చూడాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లను వెంటనే ప్రారంభించి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 5, 2025
సిద్దిపేట: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

సిద్దిపేట త్రీ టౌన్ పీఎస్ పరిధిలోని ఏన్సాన్ పల్లి గ్రామ శివారులో ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఓ ఇంటిలో మహిళలను తెచ్చి వ్యభిచారం చేయిస్తున్నారన్న సమాచారంతో దాడి చేశారు. ఈ దాడిలో ఓ మహిళ, రూ.1700 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
News March 5, 2025
కర్నూలు: వలస కూలీల కొడుకు SIగా ఎంపిక

నందవరం మండలం మిట్టసాంపురానికి చెందిన శ్యామరావు, సువర్ణమ్మ దంపతుల రెండో కుమారుడు మారెప్ప తన తొలి ప్రయత్నంలోనే సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు. అనంతపురంలో ట్రైనింగ్ను పూర్తి చేసుకున్న ఆయనకు చిత్తూరు జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు వలస కూలీలు కాగా.. తమ కష్టానికి తగిన ప్రతిఫలం నేటికి దక్కిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్థులు మారెప్పను అభినందించారు.
News March 5, 2025
రైల్వే స్టేషన్లలో వసతులపై లేఖ రాసిన MP వేమిరెడ్డి

నెల్లూరు జిల్లాలోని రైల్వే స్టేషన్ల పరిధిలో నెలకొన్న కనీస మౌలిక వసతులపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్కు లేఖ రాశారు. కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు రైల్వేస్టేషన్లో నీటి సమస్యలు, కావలి రైల్వే స్టేషన్ పరిధిలో చెత్త తరలింపు, వర్షాకాలంలో నీటి లీకేజీలు, ట్యాప్ కనెక్షన్లు, స్టేషన్ పరిధిలో బెంచీల ఏర్పాటు చేయాలని MP కోరారు.