News March 26, 2025
సంగారెడ్డి: వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో వైద్యశాఖ పై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి మాత శిశు మరణాల రేటు 50% తగ్గినట్లు చెప్పారు. ఆసుపత్రులకు వచ్చే రిస్కు కేసులు ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందిన చూడాలని సూచించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి పాల్గొన్నారు.
Similar News
News March 29, 2025
కంప్యూటరీకరణ వేగవంతం చేయాలి: బాపట్ల కలెక్టర్

సహకార సంఘాల కంప్యూటరీకరణను వేగవంతం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధికారులను ఆదేశించారు. శనివారం బాపట్ల కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలలోని సహకార సంఘాల వివరాలను కంప్యూటరీకరణ చెయ్యడంలో అధికారులు అలసత్వం వహించడంపై కలెక్టర్ అసహనం వ్యక్తపరిచారు.
News March 29, 2025
డెబ్యూలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. చరిత్ర సృష్టించాడు

పాక్తో జరిగిన తొలి వన్డేలో కివీస్ ప్లేయర్ మహమ్మద్ అబ్బాస్ చరిత్ర సృష్టించారు. డెబ్యూ మ్యాచ్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ(26 బంతుల్లో 52) చేసిన ప్లేయర్గా నిలిచారు. ఇందులో 3 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. అలాగే 7 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ కూడా తీశారు. కాగా 5 టీ20ల సిరీస్ను 4-1తో కోల్పోయిన పాక్, 3 వన్డేల సిరీస్ తొలి మ్యాచ్లో 73 పరుగుల తేడాతో ఓడిపోయింది.
News March 29, 2025
వివేకా హత్య కేసు నిందితులకు త్వరలో సినిమా: ఆదినారాయణ రెడ్డి

AP: వివేకా హత్య కేసులో CBI మళ్లీ దర్యాప్తు ప్రారంభిస్తుందని MLA ఆదినారాయణ రెడ్డి అన్నారు. దీంతో ఆ కేసులోని నిందితులకు త్వరలోనే సినిమా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లో MP అవినాశ్ పాత్రే ఎక్కువగా ఉందని తెలిపారు. మరోవైపు, తనకు YCP నేతల నుంచి ప్రాణహాని ఉందని ఇదే కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఇవాళ కడపలో వాపోయారు.