News April 18, 2025
సంగారెడ్డి: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల కృషి: ఎస్పీ

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డిలోని ఎస్పీ జిల్లా కార్యాలయంలో కుల సంఘాల నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఏమైనా అత్యవసరం అయితే 87126 56777 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవ రావు పాల్గొన్నారు.
Similar News
News January 10, 2026
జగిత్యాల: ‘సంక్రాంతి సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి’

సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలకు వెళ్లే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఈ సమయంలో దొంగతనాలు జరిగే అవకాశముందని, ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు వంటి విలువైన వస్తువులను ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని తెలిపారు. చోరీల నియంత్రణకు పోలీసు శాఖ చర్యలు చేపట్టిందని, రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేశామని పేర్కొన్నారు.
News January 10, 2026
అచ్చుతాపురం: ఒకే కాన్పులో రెండు ఆడ-మగ పెయ్యలు

ఒకే కాన్పులో రెండు పెయ్యలకు జన్మనిచ్చిన అరుదైన ఘటన రామన్నపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. రైతు రాజాన ప్రసాద్ గత కొన్ని సంవత్సరాలుగా డెయిరీ ఫామ్ నడుపుతున్నాడు. శనివారం ఉదయం తమ ఆవు రెండు పెయ్యలకు (ఆడ, మగ) జన్మనివ్వడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రెండు లేగలు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రసాద్ తెలిపారు.
News January 10, 2026
మదనపల్లె, రాయచోటి బస్సులపై కేసులు

సంక్రాంతి పండుగకు దూర ప్రాంతాల నుంచి సొంత ఊర్లకు వచ్చే ప్రజల నుంచి ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు రవాణా శాఖ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావు విజయవాడ రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలతో శనివారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మదనపల్లె, రాయచోటి, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.


