News February 13, 2025

సంగారెడ్డి: శిక్షణకు గైర్హాజరైన సిబ్బందికి మరోసారి శిక్షణ: కలెక్టర్

image

నాలుగు జిల్లాల గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన సిబ్బంది శిక్షణకు గైర్హాజరైన వారికి మరోసారి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్  వల్లూరు క్రాంతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కాగా, ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 28, 2025

ADB: సెల్ ఫోన్ పోయిందా.. ఇలా చేయండి లేకుంటే ప్రమాదమే

image

సెల్ ఫోన్లు చోరీకి గురైనా, మనం పోగొట్టుకున్నా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారం సేకరించి బ్యాంకుల్లోని డబ్బులు లూటీ చేసే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఉండాలంటే ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో కంప్లైంట్ చేయాలి. లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అప్పుడు పోలీసులు ఫోన్ ను ట్రేస్ చేసి అందిస్తారు. జిల్లాలో గత మూడేళ్లలో సుమారు 1300 ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు అప్పగించారు.

News October 28, 2025

అత్యవసర వస్తు సామగ్రిని సిద్ధం చేసుకోండి: కలెక్టర్

image

తుఫాను కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు సుమిత్ కుమార్ తెలిపారు. దీనిపై ఎటువంటి పుకార్లను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. వార్తా సమాచారం కోసం ఫోన్లలో గమనిస్తూ ఉండాలని కోరారు. అత్యవసర వస్తు సామగ్రిని సిద్ధం చేసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.

News October 28, 2025

విశాఖ: ఇంటి పన్ను మార్చడానికి రూ.50,000 లంచం

image

తగరపువలసకు చెందిన పి.దుర్గారావు తన తాత పేరు మీద ఉన్న ఇంటి పన్నును భార్య, మరదలు పేరుమీద మార్చడానికి సచివాలయానికి వెళ్లాడు. ఈ పనికి రూ.50,000 లంచం కావాలని సచివాలయం సెక్రటరీ సోమునాయుడు, ఆర్‌ఐ రాజు అడగడంతో దుర్గారావు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు తీసుకుంటుండగా ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు.