News November 11, 2025

సంగారెడ్డి: ‘సర్దుబాటు ఉత్తర్వులను సవరించాలి’

image

సంగారెడ్డి జిల్లాలో ఇటీవల ఉపాధ్యాయుల సర్దుబాటు చేసిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ మంగళవారం ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ, టీటీయూ జిల్లా అధ్యక్షుడు ఆకుల మానయ్య, ప్రసాద్ మాట్లాడుతూ.. ఇతర మండలాలకు కేటాయించిన వారిని పని చేస్తున్న మండలంలోనే సర్దుబాటు చేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని అన్నారు.

Similar News

News November 11, 2025

ఖమ్మం డీఈఓగా చైతన్య జైనీ బదిలీ

image

ఖమ్మం జిల్లా నూతన విద్యాశాఖాధికారి (డీఈఓ)గా కరీంనగర్ డీఈఓ చైతన్య జైనీ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కరీంనగర్ డీఈఓగా బాధ్యతలు చేపట్టిన చైతన్య జైనీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. కాగా, కరీంనగర్ డీఈఓగా డైట్ ప్రిన్సిపాల్ శ్రీరామ్ మొండయ్య కొనసాగనున్నారు.

News November 11, 2025

ఈ నెల 13 నుంచి అగ్రికల్చర్​ కోర్సు అడ్మిషన్లకు కౌన్సెలింగ్​

image

TG: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనుబంధ కాలేజీల్లో BSC ఆనర్స్​, అగ్రికల్చర్​ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 13 నుంచి కౌన్సెలింగ్​ నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు HYD రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీలో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని అధికారులు సూచించారు. అన్ని సర్టిఫికెట్స్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలు తీసుకురావాలని చెప్పారు. సైట్: www.pjtau.edu.in/

News November 11, 2025

MHBD జిల్లాలో మండల పరిషత్తులకు సూపరింటెండెంట్ల నియామకం

image

మహబూబాబాద్ జిల్లాలో పలు మండల పరిషత్‌లకు సూపరింటెండెంట్లను నియమిస్తూ జడ్పీ సీఈవో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.. తొర్రూరు- డి.రాజేశ్వరి, పెద్దవంగర-మహేందర్ రెడ్డి, దంతాలపల్లి-సిద్ది శ్రీనివాస్, నర్సింహులపేట-రేణుకాదేవి, కేసముద్రం-సీహెచ్ శ్రీనివాస్, కురవి-నాగమల్లేశ్వరరావు, మహబూబాబాద్-వీరభద్రరావు, చిన్నగూడూరు-శైలజ, కొత్తగూడ- జయ, గంగారం-కృష్ణ, గూడూరు పృథ్వీరాజ్‌ను కేటాయించారు.