News October 22, 2025
సంగారెడ్డి: సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్

తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in /telanganarising అనే వెబ్సైట్ను సందర్శించి ప్రతీ ఒక్కరూ తమ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించాలని తెలిపారు.
Similar News
News October 22, 2025
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

AP: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 76,343 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 18,768 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా రూ.4.34 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.
News October 22, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్స్ వెల్లువ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు సమర్పించారు. నిన్న ఒక్కరోజే 117 మంది అభ్యర్థులు 194 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. ఈరోజు స్క్రూటినీ జరగనుండగా, ఎల్లుండి వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది.
News October 22, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్స్ వెల్లువ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు సమర్పించారు. నిన్న ఒక్కరోజే 117 మంది అభ్యర్థులు 194 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. ఈరోజు స్క్రూటినీ జరగనుండగా, ఎల్లుండి వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది.