News March 27, 2025

సంగారెడ్డి: స్కావెంజర్ల వేతనాలు చెల్లించాలని వినతి

image

పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు సంగారెడ్డిలో గురువారం వినతిపత్రం సమర్పించారు. ఐదు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని దృష్టికి తీసుకువచ్చారు. ఏప్రిల్ మొదటి వారంలో వేతనాలు విడుదల చేస్తామని డీఈవో హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు సాబేర్ అలీ, కార్యదర్శి శ్రీనివాస్ రాథోడ్ పాల్గొన్నారు.

Similar News

News December 29, 2025

FLASH: వికారాబాద్‌లో జిల్లాలో మరోసారి ఎన్నికలు

image

వికారాబాద్ జిల్లాలో మరోసారి ఎన్నిక సందడి నెలకొననుంది. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో పోలింగ్‌కు అధికారులు సిద్ధం అవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం..
☞వికారాబాద్- 34 వార్డుల్లో 63,649 మంది జనాభా
☞కొండంగల్-12, వార్డుల్లో 14,294 మంది
☞పరిగి-18 వార్డుల్లో 18,241 మంది
☞తాండూరు- 36 వార్డుల్లో 71,008 మంది ఉన్నారు. JAN10కల్లా ఓటర్ల జాబితా అధికారులు సిద్ధం చేయనున్నారు.

News December 29, 2025

మేడ్చల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు!

image

మేడ్చల్ జిల్లాలో ఎన్నికల నగారా మోగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ ఎన్నికలకు EC సమాయత్తం అవుతోంది. GHMC విలీనం అనంతరం మేడ్చల్ జిల్లాలో మిగిలిన 3 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారిక జాబితా వెల్లడైంది. అలియాబాద్‌లో 20 వార్డుల్లో జానాభా 18,876, మూడుచింతలపల్లి 24 వార్డుల్లో 24,214, ఎల్లంపేట 24 వార్డులకు 25,823గా జనాభా సంఖ్య ఉంది.

News December 29, 2025

సిరిసిల్ల జిల్లాలో రెండు మునిసిపాలిటీలు.. వివరాలివే!

image

జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో 2011 జనాభా గణాంకాల ప్రకారం 1,35,711 జనాభా ఉండగా, ఇందులో 12,891 మంది ఎస్సీలు, 1,557 మంది ఎస్టీలు ఉన్నారు. 2020 మునిసిపల్ ఎన్నికల రికార్డుల ప్రకారం రెండు మున్సిపాలిటీలో కలిపి 69 వార్డులలో 1,10,625 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో యువ ఓటర్ల నమోదు జరిగిన నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను జనవరి 10వ తేదీన ప్రకటించనున్నారు