News January 30, 2025
సంగారెడ్డి: స్టాక్ మార్కెట్ పేరిట రూ.25.17 లక్షల మోసం

నకిలీ స్టాక్ మార్కెట్ పేరిట భారీ మొత్తంలో వ్యాపారి మోసపోయిన ఘటనపై అమీన్ పూర్ పీఎస్లో కేసు నమోదైంది. మున్సిపాలిటీలోని ఓ వ్యాపారికి గతేడాది Oct 8న వాట్సప్కు స్టాక్ మార్కట్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని లింక్ మెసేజ్ రావడంతో రూ.25.17 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి ఇవ్వాలనడంతో అపరిచిత వ్యక్తి స్పందించలేదు. బాధితుడు మోసపోయినట్లు గ్రహించి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
Similar News
News December 21, 2025
శ్రీవారి భక్తుల కోసం ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్!

AP: శ్రీవారి భక్తులకు తిరుపతిలోనే వసతి కల్పించేందుకు అలిపిరిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి టీటీడీ నిర్ణయించింది. 25వేల మందికి వసతి కెసాసిటీతో దాదాపు రూ.4వేల కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో వేలాది గదులు, బాత్రూమ్లు, లాకర్లు, అన్నప్రసాద వితరణ కేంద్రాలతోపాటు ప్రైవేటు రెస్టారెంట్లు, పార్కు, ఆడిటోరియం ఉంటాయని సమాచారం.
News December 21, 2025
ఎద్దు తన్నునని గుర్రంచాటున దాగినట్లు

ఎవరైనా ఎద్దు పొడుస్తుందని లేదా తన్నుతుందని భయపడి, దాని నుంచి రక్షణ కోసం వెళ్లి గుర్రం వెనుక దాక్కుంటే అంత కంటే పెద్ద ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఎద్దు కంటే గుర్రం మరింత వేగంగా, బలంగా తన్నుతుంది. అంటే ఎవరైనా వ్యక్తి ఒక చిన్న కష్టం నుంచి బయటపడాలని చూస్తూ, తనకు తెలియకుండానే అంతకంటే భయంకరమైన చిక్కుల్లో పడినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.
News December 21, 2025
కర్నూలు: నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. ఐదుగురి తొలగింపు

తెలుగు గంగ/సోమశిల ప్రాజెక్టు నిర్వాసితుల కోటాలో నకిలీ సర్టిఫికెట్లు చూపించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఐదుగురిని సేవల నుంచి తొలగించారు. ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదును విచారించిన ఉప లోకాయుక్త పి.రజని ఆదేశాలతో తిరుపతిలోని ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ తక్షణ చర్యలు చేపట్టారు. నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా తేలడంతో ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు.


