News February 24, 2025

సంగారెడ్డి: 1.08 కోట్ల రుద్రాక్షలు.. 18.06 అడుగుల శివలింగం

image

సంగారెడ్డి మండలం ఫసల్వాది సమీపంలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో 1.08 కోట్ల రుద్రాక్షలతో తయారు చేసిన 18.06 అడుగుల శివలింగాన్ని ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ప్రత్యేక పూజలు చేసి కోటి రుద్రాక్ష శివలింగాన్ని ఆవిష్కరించారు. 26న మహాశివరాత్రి సందర్భంగా కోటి రుద్రాక్ష శివలింగానికి అభిషేకం చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

Similar News

News February 24, 2025

దుద్యాల: నేటితో ముగియనున్న ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు

image

దుద్యాల మండలం పోలేపల్లిలో వెలసిన భక్తుల ఇలవేల్పు రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఆదివారం ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ వారు సోమవారం రాత్రి అమ్మవారి ఆలయాన్ని ఊరేగింపు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు పునఃప్రారంభమైనప్పటి నుంచి పోలేపల్లి ఎల్లమ్మ ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి.

News February 24, 2025

ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ విద్య

image

TGలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల పఠన సామర్థ్యాలను పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా నేటి నుంచి ఆరు జిల్లాల్లోని 36 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఆయా స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ఏఐ లెర్నింగ్ టూల్స్ ద్వారా విద్యార్థుల్లో లోపాలను గుర్తించనున్నారు. దీంతో వారికి టీచర్లు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.

News February 24, 2025

HYD: పదో తరగతి చదువుతున్నారా..? మీకోసమే!

image

పదో తరగతి పూర్తయ్యాక డైరెక్ట్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి డిప్లొమా పాలిటెక్నిక్ విద్య అందుబాటులో ఉంది. ఇందుకోసం పాలీసెట్ ప్రవేశ పరీక్ష మే 16వ తేదీన జరుగుతుందని రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధికారులు తెలిపారు. ఇందుకు ఇప్పటి నుంచే విద్యార్థులు ప్రిపేర్ అయితే మంచిగా రాణించే అవకాశాలు ఉంటాయన్నారు.

error: Content is protected !!