News December 5, 2025
సంగారెడ్డి: 10, 11 తేదీల్లో ప్రైవేట్ స్కూళ్లకు సెలవు

సంగారెడ్డి జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే మండలాల్లోని ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 10, 11 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ ప్రావీణ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి, కొండాపూర్, హత్నూర, గుమ్మడిదల, కంది, పటాన్చెరు, సదాశివపేట మండలాల్లోని ప్రైవేటు పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపారు.
Similar News
News December 5, 2025
విజయోత్సవ ర్యాలీలు, డీజేలు నిషేధం: సూర్యాపేట ఎస్పీ

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రం వద్ద 200 మీటర్ల పరిధి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ఆంక్షలకు తగినట్లుగా నడుచుకోవాలన్నారు. ఫలితాలు అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవని, ఎవరు కూడా ర్యాలీలు నిర్వహించొద్దని సూచించారు. బాణాసంచా పేల్చడం, డీజేలు ఉపయోగించడం నిషిద్ధమన్నారు.
News December 5, 2025
KMR: పనులు చేయకపోతే రాజీనామా.. సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్

సర్పంచ్ ఎన్నికల్లో బాండ్ పేపర్ ట్రెండ్ కొనసాగుతోంది. మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాకు చెందిన శివాని సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే తనను గెలిపిస్తే కామారెడ్డి- సిరిసిల్ల ప్రధాన రహదారికి ఇరువైపుల డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ రెండు హామీలు నెరవేర్చకపోతే తన పదవీకి రాజీనామ చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొంటనన్నారు.
News December 5, 2025
ఆదోని జిల్లా డిమాండ్.. టీడీపీ నేతలపై సీఎం అసంతృప్తి

కర్నూలు జిల్లా నేతల తీరుపై CM చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండును ముందుగా తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎన్నికల ముందు ఆదోని జిల్లా డిమాండ్ లేదని తిక్కారెడ్డి వివరించినట్లు సమాచారం. దీనిపై జిల్లా నేతలంతా చర్చించుకుని తన వద్దకు రావాలని సీఎం సూచించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.


