News October 5, 2025
సంగారెడ్డి: ‘12 మంది నోడల్ అధికారుల నియామకం’

స్థానిక సంస్థల ఎన్నికల కోసం 12 మంది నోడల్ అధికారులను నియమిస్తూ కలెక్టర్ ప్రావీణ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటేశ్వర్లకు సిబ్బంది నియామకం, అఖిలేశ్ రెడ్డికి బ్యాలెట్ బాక్సులు, అరుణకు రవాణా, రామాచారికి శిక్షణ కార్యక్రమాలు, స్వప్నకు సామగ్రి పంపిణీ, జగదీశ్కు ఎన్నికల ప్రవర్తన నియమావళి, బలరాంకు వ్యయ పరిశీలన, సూర్యారావుకు రిపోర్టుల పరిశీలన, బాలరాజుకు బ్యాలెట్, పోస్టల్ పేపర్ల ముద్రణ అప్పగించారు.
Similar News
News April 14, 2026
GNT: నాగార్జున వర్సిటీ బీఆర్క్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఆర్క్ (2/5) 1,2 సెమిస్టర్ల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. గతేడాది DECలో జరిగిన ఈ పరీక్షల రిజల్ట్స్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. రీవాల్యుయేషన్ కోరుకునే వారు ఈ నెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు కాపీలను 24లోగా వర్సిటీ కార్యాలయంలో అందజేయాలి. ఒక్కో సబ్జెక్టు రీవాల్యుయేషన్ ఫీజు రూ. 2070, పర్సనల్ వెరిఫికేషన్ ఫీజు రూ. 2190గా అధికారులు నిర్ణయించారు.
News April 14, 2026
మరోసారి చర్చలకు డేట్ ఫిక్స్!

యుద్ధానికి ఎండ్ కార్డ్ వేసేందుకు అమెరికా-ఇరాన్ మరోసారి శాంతి చర్చలు జరపాలని భావిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే గురువారం పీస్ టాక్స్కు అవకాశం ఉంది. అయితే మరోసారి ఇస్లామాబాద్ను వేదికగా ఎంచుకుంటారా? లేక మరో దేశంలో చర్చిస్తారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
News April 14, 2026
నోటి పుండ్లు.. క్యాన్సర్ సంకేతం కావొచ్చన్న వైద్యులు

ఎండాకాలం వేడి వల్ల నోటిలో పుండ్లు వచ్చి వాటంతట అవే తగ్గుతాయని నిర్లక్ష్యం చేయొద్దని, 14 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘ముఖ్యంగా పొగాకు వాడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు అవసరమైతే బయాప్సీ పరీక్ష ద్వారా అది సాధారణ పుండా లేదా క్యాన్సర్ సంకేతమా అని నిర్ధారిస్తారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది’ అని చెబుతున్నారు.


