News September 12, 2025
సంగారెడ్డి: 15న జిల్లా స్థాయి సైన్స్ సెమినార్

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనీ సైన్స్ సెంటర్లో ఈనెల 15న జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సెమినార్కు 8 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. క్వాంటమ్ యుగం ప్రారంభం, సంభావ్యతలు, సవాళ్లు అనే అంశంపైన సెమినార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News September 12, 2025
ASIA CUP: ఇప్పటికీ ఫైనల్ ఆడని భారత్-పాక్

ఆసియా కప్ చరిత్రలో భారత్-పాకిస్థాన్ ఇంతవరకూ ఫైనల్లో తలపడలేదు. ఇప్పటివరకు 16 ఎడిషన్లు జరగ్గా ఈ రెండు జట్లూ ఒకేసారి ఫైనల్ చేరుకోలేదు. గ్రూప్ స్టేజ్, సూపర్-4, సెమీఫైనల్ వరకే తలపడ్డాయి. ఇరు జట్లూ 19 సార్లు పోటీ పడగా 10 మ్యాచుల్లో భారత్, ఆరింటిలో పాక్ గెలిచింది. మరో 3 మ్యాచులు టైగా ముగిశాయి. మరి ఈసారైనా దాయాది జట్లు ఫైనల్లో పోటీ పడతాయా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News September 12, 2025
కంది: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి రూ.1119 కోట్ల రక్షణ శాఖ ఆర్డర్

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి రూ.1119 కోట్ల రక్షణ శాఖ ఆర్డర్ రావడం చాలా ఆనందంగా ఉందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. విలువైన ఆర్డర్ రావడం కోసం సహాయం చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, AVNL బృందానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మైలు సాధించడంలో మెదక్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తను చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటానన్నారు.
News September 12, 2025
జనగామ జిల్లా వ్యాప్తంగా 53.9 మి.మీ వర్షపాతం

జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 53.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తరిగొప్పుల 55.8, చిల్పూర్ 68.6, జఫర్గఢ్ 36.8, స్టేషన్ ఘనపూర్ 74.4, రఘునాథపల్లి 94.2, నర్మెట్ట 19.2, బచ్చన్నపేట 119.6, జనగామ 68.4, లింగాల ఘనపూర్ 74.2, దేవరుప్పుల 11.4, పాలకుర్తి 21.2, కొడకండ్ల 2.4 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.