News September 10, 2025
సంగారెడ్డి: 238 మందికి జీపీవోలకు పోస్టింగ్

ఇటీవల గ్రామ పాలన అధికారులుగా నియామక పత్రాలు అందుకున్న 238 మందికి పోస్టింగ్ ఇస్తూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు. మండల కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న మరో 87 మందికి ఇన్ఛార్జ్గా నియమించారు. పోస్టింగ్ పొందిన వారు సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆమె సూచించారు.
Similar News
News September 10, 2025
నేపాల్లో చిక్కుకున్న కాకినాడ మహిళలు

ఆంధ్రప్రదేశ్కు చెందిన 38 మంది యాత్రికులు నేపాల్లో చిక్కుకున్నారు. వీరిలో కాకినాడకు చెందిన దాట్ల రోజారాణి (45), బుద్ధరాజు సరళ (65) ఉన్నారు. వారి వివరాలను సరళ బంధువు బుద్ధరాజు సత్యనారాయణ రాజు వెల్లడించారు. ఈ విషయంపై ఆయన మంత్రి లోకేశ్తో మాట్లాడారు. లోకేశ్ స్పందించి, వారిని క్షేమంగా తిరిగి తీసుకొచ్చేందుకు హామీ ఇచ్చారు.
News September 10, 2025
ఓదెల రైల్వే ట్రాక్ మరమ్మతులు పరిశీలన

ఓదెల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో జరుగుతున్న రైల్వే ట్రాక్ మరమ్మతులను డీఆర్ఎం గోపాలకృష్ణ బుధవారం పరిశీలించారు. ఈ పనుల కారణంగా ఈ నెల 7 నుంచి 13 వరకు 31వ గేటును మూసివేశారు. ప్రత్యేక రైలులో వచ్చిన ఆయన పనుల పురోగతిని సమీక్షించి, అనుకున్న సమయానికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
News September 10, 2025
BREAKING: నిర్మల్: పిడుగు పడి ముగ్గురు మృతి

పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతిచెందిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ఈరోజు చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పెంబి మండలం గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు అలెపు ఎల్లయ్య, అల్లెపు ఎల్లవ్వతో పాటు మరో వ్యక్తి బండారు వెంకటి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాలకు పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగు పడడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.