News January 27, 2025
సంగారెడ్డి: 31 వరకు గడువు పెంపు: డీఈవో

విద్యార్థుల గుర్తింపు కోసం తీసుకువచ్చిన అపార్ దరఖాస్తు గడువు ఈనెల 31వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి పేరును తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఎంఈవోలు ప్రత్యేక చొరవ తీసుకొని పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు.
Similar News
News September 14, 2025
మొక్కలు నాటడంలో సింగరేణి సీఎండీ బలరాం రికార్డ్

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 20వేలకు పైగా మొక్కలు నాటిన తొలి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్గా సింగరేణి సీఎండీ బలరాం రికార్డ్ సృష్టించారు. భూపాలపల్లిలోని మిలీనియం క్వార్టర్స్ వెనక ఉన్న మైదానంలో ఆదివారం సింగరేణి ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి బలరాం పాల్గొని 370 మొక్కలు నాటి రికార్డ్ సృష్టించారు.
News September 14, 2025
రోజా.. నువ్వు జబర్దస్త్ చేయలేదా?: దుర్గేశ్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి వైసీపీ నేత రోజాకు లేదని మంత్రి కందుల దుర్గేశ్ ఫైర్ అయ్యారు. నువ్వు మంత్రిగా ఉండి కూడా జబర్దస్త్లో పాల్గొనలేదా అని ఆయన ప్రశ్నించారు. ‘పవన్కు డబ్బు యావ లేదు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు చేస్తున్నారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ అయినా రాష్ట్రానికి తీసుకువచ్చారా. ప్రజా సమస్యలు తీర్చారా?’ అని ఆయన మండిపడ్డారు.
News September 14, 2025
నరసరావుపేట: ‘మీకోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి’

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ‘మీకోసం’ కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా ప్రజలకు సూచించారు. సెప్టెంబర్ 15న కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరై మీ సమస్యలను తెలియజేయవచ్చని ఆమె తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని, లేదా 1100 నంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.