News February 4, 2025
సంగారెడ్డి: 8న సీనీ హీరోయిన్ రాక

ఈనెల 8న ఓ స్కూల్ 14వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రేఖ తెలిపారు. అమీన్ పూర్ మండలం బీరంగూడలోని ఓ స్కూల్లో జరిగే వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ‘సంక్రాంతి వస్తున్నాం’ ఫిలిం ఫేం, ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ రానున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు పాటలు, వివిధ రకాల నృత్య, నాటక, కరాటే ప్రదర్శనలు చేస్తారని అన్నారు.
Similar News
News February 25, 2026
ఈ పొరపాటు చేస్తే పశువులకు అబార్షన్ అవుతుంది

కొన్ని పశువులు గర్భంతో ఉన్నప్పటికీ తీగలు వేస్తుంటాయి. దీనికి కారణం పశువులు గర్భంతో ఉన్నప్పుడు 4 లేదా 5వ నెలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల తీగలు వేస్తాయి. దీన్నే జస్టేషనల్ హీట్ అంటారు. అందుకే ఎద ఇంజెక్షన్ వేసిన మూడు నెలల తర్వాత పశువులకు చూడి నిర్ధారణ పరీక్ష తప్పకుండా నిర్వహించాలి. ఇది చేయకుండా తీగలు వేసిందని మళ్లీ ఎద ఇంజెక్షన్ వేయిస్తే అబార్షన్ అవుతుందని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News February 25, 2026
విశాఖ: రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి టోకరా.. రూ.89 లక్షలు దోచేశాడు

నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి సుప్రీంకోర్టు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.89 లక్షలు కాజేయడంతో నష్టపోయానని తెలుసుకున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయనగరానికి చెందిన సీహెచ్ రవి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.
News February 25, 2026
శరీర చక్రాలపై మంత్రాల ప్రభావం

మన శరీరంలో 7 శక్తి కేంద్రాలుంటాయి. ఈ చక్రాల ద్వారానే ప్రాణశక్తి ప్రవహిస్తుంది. ఒక్కో చక్రానికి ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం మంత్రాలను పఠించినప్పుడు వచ్చే ధ్వని తరంగాలు ఈ చక్రాల్లోని అడ్డంకులను తొలగించి, వాటిని సమతుల్యం చేస్తాయి. ఉదాహరణకు ‘ఓం’ కార నాదం శరీరంలోని అన్ని భాగాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఇలా మంత్ర పఠనం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని, శక్తిని పొందవచ్చని నాద యోగం వివరిస్తుంది.


