News February 8, 2025
సంగారెడ్డి: 9న ఎన్నికల విధులపై అధికారులకు శిక్షణ: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు ఈ నెల 9న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి శుక్రవారం తెలిపారు. ఈ శిక్షణకు విధులు కేటాయించిన అధికారులందరూ హాజరు కావాలని సూచించారు.
Similar News
News November 4, 2025
కరీంనగర్: SU B.com, Bsc పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

SU పరిధిలో జరుగనున్న బి.కాం (బి.ఎస్.ఎఫ్.ఐ) ఈ-కామర్స్, బీ.ఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ విభాగంలో 1వ సెమిస్టర్ పరీక్షల <<18189571>>ఫీజు<<>> నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా NOV 07 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో NOV 10 వరకు చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ లో చూడాలని సూచించారు.
News November 4, 2025
హనుమకొండ: భూ కబ్జాకు యత్నం.. ఇద్దరి అరెస్టు

HNK జిల్లా కాకతీయ యూనివర్సిటీ శివారులో భూకబ్జా యత్నం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుండ్లసింగారం సర్వే నంబర్ 1/1లో తన భూమిని మహ్మద్ ఇబ్రహీం, లింగంపల్లి నేతాజీలు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని బాధితుడు బిత్తిని వేణుగోపాలరావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. విచారణలో నిందితుల ప్రమేయం తేలడంతో వారిని అదుపులోకి తీసుకుని రిమాండుకు పంపినట్లు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు తెలిపారు.
News November 4, 2025
స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుంది: శ్రీనివాస వర్మ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుందని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. ప్రైవేటీకరణ చేయాలనుకునే ప్రభుత్వం రూ.11,440 కోట్ల ఆర్థిక సహాయం ఎందుకు ప్రకటిస్తుందని ప్రశ్నించారు. నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ప్లాంట్ నిర్మాణానికి డిసెంబర్లో శంకుస్థాపన జరగనున్నట్టు వెల్లడించారు. తాళ్లపాలెంలో NCL ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొత్త సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్ను ప్రారంభించారు.


