News August 28, 2024
సంగారెడ్డి: ALERT.. కాన్ఫరెన్స్లో పెట్టి కాజేశారు

ఎల్ఐసీ పాలసీ పూర్తయినందున డబ్బులు అకౌంట్లో వేస్తామని న్యాల్కల్(M) బసంతపూర్కి చెందిన వెంకట్రెడ్డికి ఫోన్ వచ్చింది. బ్యాంకు ఖాతా నంబర్ చెప్పాలని కోరగా వెంటనే ఇచ్చాడు. అందులో డబ్బు లేదని, కనీసం రూ.3 వేలు ఉండాలని సైబర్ నేరగాడు చెప్పాడు. డబ్బులు వేస్తామని, వేరే వారి నంబర్ ఇవ్వాలని అడగ్గా అతడు సుదర్శన్రెడ్డికి కాన్ఫరెన్స్ కలిపాడు. అతడిని మాటల్లో పెట్టి ఖాతా నుంచి రూ.99 వేలు కొట్టేశాడు.
Similar News
News February 11, 2026
మెదక్: రేపు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ: కలెక్టర్

మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈనెల 12న నియమితులైన కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ విధులకు నియమించబడిన సిబ్బందిని వారి సంబంధిత అధికారులు రెండు రోజులపాటు విధుల నుంచి విడుదల చేయాలని ఆదేశించారు.
News February 11, 2026
మెదక్: ‘మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పక్రియ ప్రశాంతం’

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పక్రియ ప్రశాంతంగా జరుగుతున్నట్లు సాధారణ పరిశీలకులు రవి కిరణ్ తెలిపారు. మున్సిపల్ పరిధిలో ఉన్న పలు వార్డులలో, పోలింగ్ కేంద్రాలలో విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. పోలింగ్ సిబ్బందిని, పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లను ఓటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటూ తెలుసుకున్నారు. మెదక్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవో రమాదేవి ఉన్నారు.
News February 11, 2026
నర్సాపూర్: ఓటు కేవలం హక్కు కాదు.. బాధ్యత!

పురపాలక ఎన్నికల సందర్భంగా నర్సాపూర్కు చెందిన నవీన్-దివ్య దంపతులు తమ పసిపిల్లలతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలకు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లులు సైతం వచ్చి ఓటు వేయడం ఆదర్శనీయమని, సమయం ఉండి ఓటు వేయని వారు వీరిని చూసి మారాలని పలువురు అంటున్నారు.


