News January 13, 2026
సంగారెడ్డి: GREAT.. జిల్లా వాసికి ప్రిడ్ భారతరత్న అవార్డ్

HYD రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన వినాయక్ పవర్కు ప్రతిష్టాత్మక ప్రిడ్ భారతరత్న అవార్డు-2026 లభించింది. వల్లూరి ఫౌండేషన్, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ అవార్డును అందజేశారు. 2020-2025 మధ్య ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిటీ ఛైర్మన్గా ఆయన అందిస్తున్న సేవలను పలువురు ప్రశంసించారు.
Similar News
News February 16, 2026
ఎక్ససైజ్ చేసినా బరువు తగ్గడం లేదా?

జిమ్లో కసరత్తులు, డైలీ జాగింగ్ చేసినా బరువు తగ్గడం లేదని చాలా మంది మదనపడుతుంటారు. అయితే క్యాలరీలను అతిగా బర్న్ చేశామని భావించడం, వ్యాయామం తర్వాత ఎక్కువగా తినడం దీనికి కారణం కావచ్చని డైటీషియన్లు అంటున్నారు. ‘ఎక్ససైజ్ చేస్తున్నామని రోజువారీ దినచర్యపై నిర్లక్ష్యం వహించడం, సరిగ్గా నిద్రపోకపోవడం కూడా కారణం కావచ్చు. జిమ్తోపాటు క్రమశిక్షణ ముఖ్యం. కఠిన డైట్ కొనసాగించాలి’ అని సూచిస్తున్నారు.
News February 16, 2026
మున్సిపోల్స్: మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక నేడే

TG: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, 7 కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఇవాళ జరగనుంది. <<19147238>>కరీంనగర్ మినహా<<>> మిగతా కార్పొరేషన్లన్నీ కాంగ్రెస్కే దక్కే అవకాశముంది. మరోవైపు 60కి పైగా మున్సిపాలిటీలను ఆ పార్టీ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఈ క్రమంలో హంగ్ ఏర్పడిన చోట ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఇండిపెండెంట్లు కీలకంగా మారారు.
News February 16, 2026
విజయవాడలో నేడు బిల్ గేట్స్ పర్యటన.. వివరాలివే!

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధినేత బిల్ గేట్స్ సోమవారం విజయవాడలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కీలక రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించేందుకు ఆయన తన బృందంతో కలిసి వస్తున్నారు. ఉదయం 8:10 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన సచివాలయం చేరుకుంటారన్నారు. అలాగే మధ్యాహ్నం 12:40కు పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య స్టేడియంకు విచ్చేయనున్నారు.


