News January 17, 2025
సంతబొమ్మాళి: మనస్తాపంతో సూసైడ్: ఎస్సై

పురుగు మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంతబొమ్మాళిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి మండలం గొల్లపేట గ్రామానికి చెందిన పాలిన వీరస్వామి బుధవారం భార్యతో గొడవపడ్డాడు. మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేశామని ఎస్సై సింహాచలం తెలిపారు.
Similar News
News October 31, 2025
SKLM: ‘పోటీ పరీక్షలకు మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ’

మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనారిటీ అభ్యర్థులకు ఎస్.ఐ, కానిస్టేబుల్, టెట్, డీఎస్సీ ఉద్యోగాల కోసం ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ED కె.కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విజయనగరం శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం జిల్లాల్లో ఆసక్తి గల అభ్యర్థులు https://apcedmmwd.org వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 30, 2025
SKLM: పోలీస్ కుటుంబానికి రూ.కోటి అందజేత

శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న జగదీష్ కుటుంబానికి రూ.కోటిలను ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ ఏడాది జూన్ నెలలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వారా ఈ నష్టపరిహారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిందని SP పేర్కొన్నారు. ఖాతాలకు పోలీస్ శాలరీ ప్యాకేజ్ అనుసంధానం చేసుకోవాలన్నారు.
News October 30, 2025
కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం మృతి

కొత్తూరు మండలం కడుమ సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎం మాలతీబాయి (48) రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రం కాశీనగరంలో నివాసం ఉంటూ ప్రతిరోజూ విధులకు కడుమ సచివాలయానికి ద్విచక్ర వాహనంపై వస్తుంటారు. ఇవాళ విధులకు వస్తుండగా అదుపుతప్పి ప్రమాదానికి గురై మాలతీ బాయి మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


