News December 13, 2025

సంతబొమ్మాళి: రాకాసి అలలు..ప్రాణాలు తీశాయి

image

చేపల వేటకెళ్లిన మత్స్యకారుడు మృతి చెందిన ఘటన సంతబొమ్మాళి(M) భావనపాడులో శనివారం ఉదయం జరిగింది. తోటి జాలర్లతో వేటకెళ్లిన రాజయ్య(60) బలమైన కెరటాలకు తెప్ప నుంచి ప్రమాదవశాత్తూ సముద్రంలోకి పడిపోయాడు. పక్కనే ఉన్నవారు అప్రమత్తమై కాపాడేలోపే రాకాసి అలల తాకిడికి తనువు చాలించాడు. అనంతరం డెడ్ బాడీని ఒడ్డుకు తీసుకురాగా..సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Similar News

News March 6, 2026

జడ్పీ ఎన్నికలు శ్రీకాకుళం జిల్లాలోని 8 నియోజకవర్గాలకే!

image

ఏపీలోని 2021లో జిల్లాల పునర్విభజన జరగక మొత్తం 13 జిల్లాలోని మండలాలకు జడ్పీ ఎన్నికలు జరిగాయి. అనంతరం 2022లో 26 జిల్లాలుగా YCP ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2024లో అధికారంలోకొచ్చిన కూటమి ఇటీవల 26ను..28 జిల్లాలుగా మార్చింది. గతంలో పాత జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు ఉమ్మడి శ్రీకాకుళంలోని పది నియోజకవర్గాల్లో జరిగాయి. ప్రస్తుతం 8 నియోజకవర్గాలకు జడ్పీ ఎన్నికలు జరిపేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

News March 6, 2026

కోరాడ కాలనీలో పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

హిరమండలం మండలం కోరాడ కాలనీ జిల్లా పరిషత్  ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. స్కూల్ అభివృద్ధికి రూ. 2,00,000లను, సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 25వేల నిధులను మంజూరు చేశారు.
శుభలయ ఆర్‌ఆర్కాలనీ వాటర్ ట్యాంక్ మెట్ల నిర్మాణానికి రూ.50వేల నిధులు మంజూరు చేశారు. జడ్పీటీసీ బుచ్చిబాబు ఉన్నారు.

News March 6, 2026

SKLM: టెన్త్ విద్యార్థుల్లారా.. మీ ఫోన్‌కే హాల్ టికెట్

image

ఈనెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ హాల్ టికెట్‌లను ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌ ఫోన్ నంబర్ 9552300009లో ఎడ్యుకేషన్ సర్వీస్ ఎంపిక చేసి ‘హాయ్’ అని మెసేజ్ చేసి తగు వివరాలు ఎంటర్ చేస్తే హాల్ టికెట్ వస్తుంది. జిల్లాలో 3014 స్కూల్స్ నుంచి 29,398 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు.