News February 13, 2025
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతికి సెలవు ప్రకటించాలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739386674328_52434120-normal-WIFI.webp)
లంబాడాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలని, లంబాడీల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షుడు డా.రాజ్ కుమార్ జాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుగులోత్ ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కమాండ్ కంట్రోల్ ప్రాంగణంలో మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేసింది. సెలవు ప్రకటించేలా కృషి చేస్తానని చెప్పారు.
Similar News
News February 13, 2025
గుంటూరు: వేసవి తాపాన్ని తీరుస్తున్న పుచ్చకాయలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739419394562_20442021-normal-WIFI.webp)
గుంటూరు జిల్లా వ్యాప్తంగా పుచ్చకాయలు అందుబాటులో ఉన్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనంతో పాటు పోషక విలువ అధికంగా ఉండడంతో వీటి కొనుగోలు కోసం ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. కిలో పుచ్చకాయ ధర రూ.40 నుంచి రూ.45 పలుకుతోంది. ధరలు కాస్తా అధికంగా ఉన్నప్పటికీ ప్రజలు తింటున్నారు. ఎండ వేడిమిని తట్టుకోవడానికి ఇవి ఎంతో మేలు చేస్తాయని ప్రజలు భావిస్తున్నారు. వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు.
News February 13, 2025
శ్రీకాకుళంలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదు: రాజగోపాలరావు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739425596834_20246583-normal-WIFI.webp)
నేటి వరకు శ్రీకాకుళం జిల్లాలో ఒక్క బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా.కె.రాజగోపాలరావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ వ్యాధి లక్షణాలతో కోళ్లు మృతి చెందలేదని అన్నారు. జిల్లాలోని ప్రతి కోళ్ల ఫారంలు తనిఖీ చేయడానికి 68 రాపిడ్ యాక్షన్ టీమ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. కోళ్ల పెంపకందారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News February 13, 2025
మోహన్ బాబుకు ముందస్తు బెయిల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739425732093_367-normal-WIFI.webp)
జర్నలిస్టుపై దాడి కేసులో ప్రముఖ నటుడు మోహన్ బాబుకు ఊరట దక్కింది. ఆయనకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.