News August 3, 2024
సగానికి పైగా గంజాయి, డ్రగ్స్ కేసులు HYD నగరంలోనే!

విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ వంటివి యువతకు చేరడం, అర్థరాత్రిళ్లూ మద్యం అమ్మకాలు నేరాలకు కారణమవుతున్నాయి. మూడు కమిషనరేట్లలో మాదకద్రవ్యాలను అడ్డుకుంటున్నా ఏదో ఒక రూపంలో చేరుతున్నాయి. టీజీన్యాబ్ ఈ ఏడాది ఇప్పటి వరకూ 788 కేసుల్లో 1580 మందిని అరెస్టు చేసి రూ.74 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకుంది. ఇందులో సగానికి పైగా రాజధాని HYD పరిధిలో స్వాధీనం చేసుకున్నవే కావడం గమనార్హం.
Similar News
News November 5, 2025
KTRతో చర్చకు సిద్ధం: జూపల్లి కృష్ణారావు

కేటీఆర్పై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కో వ్యక్తిపై రూ.4 లక్షల అప్పు మోపారని, పదేళ్లు బుల్డోజర్ పాలన నడిపిందీ బీఆర్ఎస్సేనని మండిపడ్డారు. అధికారులను బెదిరిస్తున్నానన్న ఆరోపణలు నిరాధారమని, తన బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తున్నానని చెప్పారు. అవసరమైతే దీనిపై KTRతో చర్చకు సిద్ధమని జూపల్లి సవాల్ విసిరారు. ఫేక్ సర్వేలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు.
News November 5, 2025
FLASH: బీజాపూర్- HYD హైవేపై మరో యాక్సిడెంట్

మీర్జాగూడ ఘటన మరవకముందే తాజాగా బీజాపూర్-HYD జాతీయ రహదారిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం తాజ్ సర్కిల్ వద్ద బుధవారం హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న కారు రోడ్డు ఇరుకుగా ఉండడంతో వేగంగా మర్రిచెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు యువకులకు గాయాలవగా మరొక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
News November 5, 2025
BE READY.. నగరంలో బిగ్గెస్ట్ పెట్ షో

ఈనెల 22,23 తేదీల్లో సిటీలో అతి పెద్ద పెట్ షో జరుగనుంది. నార్సింగిలోని ఓమ్ కన్వెన్షన్ ఇందుకు వేదిక కానుంది. దాపు 500 విభిన్న జాతులకు చెందిన కుక్కలు ప్రదర్శనకు రానున్నాయి. అంతేకాక వందకుపైగా పిల్లుల జాతులు, అరుదైన చేపలు అలరించనున్నాయి. ఇంకో విషయమేమంటే.. ఈ ఎగ్జిబిషన్లో పెట్స్ యాక్సెసరీస్ కూడా అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.


