News April 2, 2024

సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ: గుంటూరు కలెక్టర్

image

ఎన్నికల నిబంధనల మేరకు ప్రజలకు సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ పంపిణీపై ఎన్నికల సంఘం కచ్చితమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. సచివాలయాలలో పెన్షన్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే సచివాలయ సిబ్బందికి లాగిన్లు ఇచ్చామన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు.

Similar News

News July 4, 2025

GNT: సీలింగ్ భూముల క్రమబద్ధీకరణపై జేసీ సమీక్ష

image

సీలింగ్ భూములు క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన వారు ఈ ఏడాది డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ సూచించారు. కాంపిటెంట్ అథారిటీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ అధికారులతో కలిసి తహశీల్దార్‌లు, సర్వేయర్‌లతో గుంటూరు కలెక్టరేట్‌లో జేసీ శుక్రవారం సమీక్ష చేశారు. సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ కోసం గతంలో వచ్చిన అర్జీలపై విచారణ జరిపి అధికారులు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.

News May 8, 2025

గుంటూరు మిర్చి యార్డ్‌లో నేటి ధరలివే.! 

image

గుంటూరు మిరప మార్కెట్‌కు గురువారం 55,000 బస్తాల దిగుబడి నమోదైంది. వివిధ రకాల మిరప ధరలు ఇలా ఉన్నాయి. తేజా బెస్ట్ రూ.80-125, సూపర్ డీలక్స్ రూ.130. భెడిగి రకాలు (355, 2043) రూ.80-120 మధ్య, 341 బెస్ట్ రూ.80-130 మధ్య ట్రేడ్ అయ్యాయి. షార్క్ రకాలు రూ.80-110, సీజెంటా భెడిగి రూ.80-110, నం:5 రకం రూ.90-125 ధరలు పలికాయి. డి.డి రకం రూ.80-115, 273 రకం రూ.90-120, ఆర్ముర్ రకం రూ.75గా విక్రయించబడ్డాయి.  

News May 8, 2025

గుంటూరు: తగ్గుతున్న వేసవి బంధాలు  

image

వేసవి వచ్చిందంటే చాలు గతంలో పిల్లలంతా అమ్మమ్మల ఊళ్లకు పయనమయ్యేవారు. పొలాల్లో ఆటలు, తాతయ్యల సరదాలు.. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. కానీ, నేటి తరం పిల్లలకు ఆ అనుభూతి అంతగా కలగడం లేదు. గతంలో వేసవి సెలవుల్లో బంధువుల కలయికతో సందడిగా ఉండేది. ఇప్పుడు ఆ సందడి కనుమరుగవుతోంది. తాతయ్యల ఒడిలో కథలు వినడం, అమ్మమ్మల చేతి గోరు ముద్దలు వంటివి అరుదుగా కనిపిస్తున్నాయి. మీకున్న జ్ఞాపకాలు ఎంటో COMMENT చేయండి.