News October 8, 2024
సచివాలయ ఉద్యోగులను వేధించడం దారుణం: మజ్జి శ్రీనివాసరావు
సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం తన ఛాంబర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అనేక విపత్కర పరిస్థితుల్లో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు అండగా నిలబడ్డాయన్నారు. విజయనగరం మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య సచివాలయ సిబ్బందిపై దుర్భాషలు ఆడుతూ వేధించడం దారుణమన్నారు. ఉద్యోగులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు.
Similar News
News October 8, 2024
విజయనగరం: ఉత్సవాలపై డీఐజీ సమీక్ష
ఈనెల 13,14,15 తేదీల్లో జరిగే విజయనగర ఉత్సవాలు, శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర నేపథ్యంలో.. భద్రత, బందోబస్తు ఏర్పాట్లను విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.
News October 8, 2024
పైడితల్లమ్మ జాతరకు యుద్ధప్రాతిపదికన పనులు
ఈనెల 15న నిర్వహించనున్నట్లు పైడితల్లమ్మ సిరిమాను జాతర మహోత్సవానికి విజయనగరం నగరపాలక సంస్థ తరఫున, అన్ని సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పిస్తున్నట్లు కమిషనర్ పి నల్లనయ్య తెలిపారు. రూ.1.20 కోట్లతో బీటీ రోడ్డు, వివిధ రహదారుల మరమ్మతు పనులు, డివైడర్లు, రెయిలింగులకు రంగులు వేస్తున్నట్లు చెప్పారు. వివిధ జంక్షన్లలో విద్యుదీకరణ, అలాగే ప్రాశస్త్య భవనాలకు విద్యుదీకరణ వంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
News October 8, 2024
విజయనగరంలో సుద్దాల అశోక్ తేజ పర్యటన
అమ్మ వంటి మాతృభాషను గౌరవించుకోవాలని, తెలుగు భాషను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పరిపాలన అధికారి డాక్టర్ సూర్యనారాయణ పాల్గొన్నారు.