News November 11, 2025

సచివాలయ సిబ్బందికి మెమోలు జారీ చెయ్యండి: కలెక్టర్

image

మక్కువ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న గ్రీన్ అంబాసిడర్లును విధుల నుంచి తొలగించమని ఈవో బెహరా శ్రీనివాస్‌ను కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. గ్రీన్ అంబాసిడర్లకు విధుల నుంచి తొలగించడంతో పాటు సచివాలయంలో పనిచేస్తున్న 9 మంది సిబ్బందికి మెమోలు జారీ చేయాలని ఎంపీడీవోకు ఆదేశించారు.

Similar News

News November 11, 2025

తూ.గో: హోం స్టే పెడితే రూ.5లక్షలు

image

తూ.గో జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో కనీసం ఓ గది నుంచి గరిష్ఠంగా 6గదులతో హోం స్టే ఏర్పాటు చేసుకోవచ్చని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ‘కొత్తగా పెట్టేవారికి స్వదేశ దర్శన్ పథకం కింద రూ.5 లక్షల ప్రోత్సాహకం ఇస్తాం. పాత హోమ్ స్టే పునరుద్ధరణకు రూ.3లక్షల వరకు సాయం చేస్తాం. 7ఏళ్లు 100 శాతం SGST తిరిగి చెల్లిస్తాం. మొదటి మూడేళ్లు రిజిస్ట్రేషన్ ఉచితం. యజమాని అదే ఏరియాలో ఉండాలి’ అని కలెక్టర్ చెప్పారు.

News November 11, 2025

‘మనోబంధు’కు సహకరిస్తాం: SP

image

మనోబంధు కార్యక్రమానికి పోలీస్ యంత్రాంగం సహకరిస్తుందని ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మనోబంధు కార్యక్రమం నిర్వహణ కరపత్రాలను ఆవిష్కరించారు. స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. మానసిక రుగ్మతలతో బాధపడుతూ వీధుల్లో సంచరిస్తున్న వారికి వైద్యం అందించి కుటుంబీకుల చెంతకు చేర్చడం జరుగుతుందన్నారు.

News November 11, 2025

గద్వాల: గ్రామ సభలపై అవగాహన ముఖ్యం

image

గ్రామ స్థాయిలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి గ్రామ స్థాయి అధికారులు సమాచార హక్కు చట్టం, గ్రామసభల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగేంద్ర సూచించారు. మంగళవారం గద్వాల కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి అధికారులు ప్రతి నెలా తప్పనిసరిగా గ్రామసభలను నిర్వహించాలన్నారు.