News February 26, 2025

సజావుగా ఎన్నికలు నిర్వహించండి: జిల్లా కలెక్టర్

image

ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్‌‌లో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం తలారిసింగి ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన నాలుగు జోన్లు, రూట్ల అధికారులు, సిబ్బందితో మాట్లాడి, తగు సూచనలు జారీ చేశారు. ప్రిసైడింగ్ అధికారులకు పలు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టి అనుమాన నివృత్తి చేశారు.

Similar News

News November 8, 2025

ALERT: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?

image

డిజిటల్, ఆన్‌లైన్‌ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని సెబీ హెచ్చరించింది. ఈ విధానం తమ పరిధిలోకి రాదని, మోసాలకు తాము బాధ్యత వహించలేమని స్పష్టం చేసింది. వాటిలో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్కులు ఉంటాయని పేర్కొంది. దీని వల్ల పెట్టుబడిదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ETF, EGRsలే తమ పరిధిలోకి వస్తాయని, వాటి ద్వారా గోల్డ్ కొనుగోలు చేయడం సురక్షితమని వెల్లడించింది.

News November 8, 2025

మెదక్: దారుణం.. తల్లిని కొట్టి చంపిన కొడుకు

image

టేక్మాల్ మండలం వేల్పుగొండలో తల్లిని కొట్టి చంపిన దారుణ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన సుదర్శన్ శుక్రవారం రాత్రి తల్లి సత్యమ్మ(60)తో మద్యం కోసం డబ్బుల విషయమై గొడవ పడ్డాడు. తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో తాగి ఉన్న అతడు కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ సత్యమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమార్తె అనురాధ ఫిర్యాదుతో ఏఎస్ఐ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 8, 2025

కాలువలో కొట్టుకొచ్చిన 2 మృతదేహాలు

image

తుంగభద్ర రిజర్వాయర్ నుంచి వచ్చే ఎగువ కాలువలో బొమ్మనహాల్ హెచ్ఎల్సీ సెక్షన్ పరిధిలో 116 కిలోమీటర్ల వద్ద రెండు గుర్తుతెలియని మృతదేహాలు కొట్టుకొచ్చాయి. శనివారం సాయంత్రం మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలు ఎవరివనే సమాచారం తెలియ రాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.