News March 21, 2025
సజావుగా పదో తరగతి పరీక్షలు: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగుతున్నాయని, పొరపాట్లకు తావులేకుండా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం విజయవాడ సూర్యారావుపేటలోని కర్నాటి రామ్మోహన్రావు మునిసిపల్ ఉన్నతపాఠశాల పరీక్ష కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను అయన పరిశీలించారు.
Similar News
News March 28, 2025
రూ.14 లక్షలు పలికిన ఒంగోలు గిత్త

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని డి.రంగాపురం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి ఒంగోలు జాతి గిత్తను రూ.14 లక్షలకు విక్రయించారు. ప్రకాశం జిల్లా ముదిరముప్పాల గ్రామానికి చెందిన శేషాద్రి చౌదరి గిత్తను కొనుగోలు చేశారు. ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఈ ఒంగోలు గిత్త ఎడ్ల పోటీల్లో సత్తా చాటుతోంది. ఇది వరకు పలు పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో బహుమతులను గెలుపొందింది.
News March 28, 2025
ఓదెల మల్లన్న ఆలయ హుండీ ఆదాయం రూ.33,59,130

ఓదెల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయ హుండీ లెక్కింపును నిర్వహించారు. 3 నెలల ఆదాయం రూ.33,59,130, మిశ్రమ బంగారం 40.900 గ్రాముల, 7.200 కేజీల వెండి వచ్చిందని ఆలయ ఈవో సదయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక అధికారి శ్రీనివాస్ జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి, అర్చకులు, బ్యాంకు ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, రాజరాజేశ్వర సేవా సమితి తదితరులు పాల్గొన్నారు.
News March 28, 2025
కాకాణి ముందస్తు బెయిల్పై హై కోర్ట్ కీలక ఆదేశాలు

తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన కాకాణి పిటిషన్పై కోర్ట్.. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వరదాపురం పరిధిలోని ప్రభుత్వ భూమిలో కాకాణి అక్రమంగా మైనింగ్ చేశారంటూ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ నెల 16న ఆయనపై కేసు నమోదైంది. దీనిపై బెయిల్ కోరుతూ కాకాణి కోర్టుకు వెళ్లగా.. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తమకు సర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.