News August 23, 2025
సజావుగా పోలీస్ కానిస్టేబుల్స్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ : SP

కానిస్టేబుల్ ఉద్యోగానికి జరిగిన వివిధ పరీక్షలలో ఉత్తీర్ణత పొంది ఉద్యోగాన్ని సాధించిన అభ్యర్థులందరికీ ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు భవిష్యత్తులో క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని SP కృష్ణ కాంత్ సూచించారు.
Similar News
News August 24, 2025
కీలక మలుపు తిరిగిన కరేడు రైతు ఉద్యమం

రాష్ట్రంలో సంచలనం రేపిన కరేడు రైతు ఉద్యమం ఆసక్తికర మలుపు తిరిగింది. ఉలవపాడు(M) కరేడులో ఇండోసోల్ పరిశ్రమ కోసం ఇచ్చిన 4,800 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరుతూ పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కరేడు, ఉలవపాడు, కందుకూరు తదితర ప్రాంతాలలోని 10 దేవాలయాలకు చెందిన 104.21 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్దంగా నోటిఫికేషన్లో చేర్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో హైకోర్టు విచారణ చేపట్టింది.
News August 23, 2025
తొలి వారం 7.6 లక్షల మంది ‘స్త్రీశక్తి’ ప్రయాణాలు : RM షమీమ్

జిల్లాలో స్త్రీశక్తి పథకం ఆరంభించాక తొలి వారం 7,64,311 మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షమీమ్ తెలిపారు. శనివారం ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభం కాగా, 22 వ తేదీ వరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ వంటి మూడు రకాల బస్లలో మొత్తం 14,88,537 మంది ప్రయాణించారన్నారు.
News August 23, 2025
DSCలో మూడు ఉద్యోగాలు సాధించిన సాయినాథ్

ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం తిమ్మనాయుడుపాళెం గ్రామానికి చెందిన కావలి సాయినాథ్ DSC పరీక్షలో ఒకేసారి 3 ఉద్యోగాలు సాధించాడు. PGT SOCIAL – 22nd rank, SA SOCIAL -23 RANK, TGT SOCIAL – 59th Rank సాధించి 3 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. సాయినాథ్ను పలువురు అభినందించారు.