News October 8, 2025
సత్యం VS సుంకే.. చొప్పదండిలో ‘WILD పాలిటిక్స్’..!

హత్యా బెదిరింపులు, సూసైడ్ అటెంప్టులు, PSలో కేసులు వెరసి చొప్పదండి MLA, మాజీ MLAల మధ్య పాలిటిక్స్ వైల్డ్గా మారాయి. MLA సత్యంను దూషిస్తే హత్య చేస్తామంటూ మాజీ MLA రవిశంకర్కు బెదిరింపు CALLS రావడంతో PSలో ఫిర్యాదయ్యారు. MLAనే కేసు పెట్టించి పోలీసులతో కొట్టించడంతోనే హిమ్మత్ నగర్వాసి శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చేశాడని సుంకే ఆరోపించారు. MLA, మాజీ MLA మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్లు పరిస్థితులున్నాయి.
Similar News
News October 8, 2025
ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: మధుసూదన్ రెడ్డి

దేశంలో ప్రధాని మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని MBNR జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి విమర్శించారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణపై జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తోందని, ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని పేర్కొన్నారు.
News October 8, 2025
మన్యం జిల్లాలో పచ్చకామెర్లతో మరో ఇద్దరు మృతి!

కురుపాం గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగి వారంరోజులు గడవకముందే గుమ్మలక్ష్మిపురం మండలం బాలేసి గ్రామానికి చెందిన ఎన్.సుమన్ (పైఫోటోలో) మంగళవారం పచ్చకామెర్లతో మృతిచెందగా, జియ్యమ్మవలస మండలం చినధోడ్జి గ్రామానికి చెందిన నిమ్మక ప్రశాంత్ బుధవారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
News October 8, 2025
పోలీసు సేవలు మెరుగుపరచాలి: ఎస్పీ నరసింహా

సూర్యాపేట: పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహా బుధవారం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, పోలీసు పరికరాలు, సిబ్బంది కవాతును ఆయన పరిశీలించారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు. అంతకు ముందు ఎస్పీకి డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ వెంకటయ్య, ఎస్ఐలు, సిబ్బంది ఎస్పీకి గౌరవ వందనంతో స్వాగతం పలికారు.