News October 31, 2024

సత్యవేడు: పూడ్చిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం

image

తమిళనాడు ఊతుకోటకు చెందిన ధనశేఖర్ కుమారుడు దినేశ్‌ను 2 నెలల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధనశేఖర్ ఊతుకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యవేడు మండలం దాసుకుప్పం పంచాయతీ చెన్నేరి వద్ద మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. సత్యవేడు సీఐ మురళి, ఊతుకోట డీఎస్పీ శాంతి సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వ వైద్యులు, తహశీల్దార్ సుబ్రహ్మణ్యం సమక్షంలో పోస్టుమార్టం చేశారు.

Similar News

News March 2, 2026

చిత్తూరు: కరెంట్ సమస్య ఉంటే కాల్ చేయండి!

image

చిత్తూరు జిల్లాలో చాలా మంది లోవోల్టేజ్, ఎక్కువ కరెంట్ ఛార్జీలు, మీటర్ల నూతన కనెక్షన్లు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి పరిష్కారానికి ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం నేడు నిర్వహిస్తున్నామని ఎస్ఈ ఇస్మాయిల్ ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల లోపు 79931 47979 నంబర్‌కు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చు. వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటారు.

News March 2, 2026

నేడు చిత్తూరు కలెక్టరేట్‌లో PGRS

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.

News March 1, 2026

చౌడేపల్లి: చిరుత దాడిలో దూడ మృతి

image

చౌడేపల్లి మండలం ముదిరెడ్డిపల్లికి చెందిన రైతు గిరి తన పశువుల మేత కోసం గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో తోలుకెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం పెద్ద వక్కిరి వద్ద పశువులు మేత మేస్తుండగా చిరుత దాడి చేసినట్లు రైతు తెలిపాడు. ఈ దాడిలో దూడ మృతి చెందినట్లు వాపోయాడు. చిరుత పులి దాడి నుంచి పశువులను కాపాడాలని రైతులు కోరుతున్నారు.