News February 9, 2026
సత్యసాయి: ‘అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి’

పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను ప్రజల సంతృప్త స్థాయి పెరిగేలా త్వరితగతిన పరిష్కరించాలని సత్యసాయి జిల్లా JC మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. మొత్తం 293 అర్జీలురాగా వాటిపై తగు చర్యలు తీసుకొని పరిష్కరించాలన్నారు.
Similar News
News February 20, 2026
బాలికపై గ్యాంగ్ రేప్.. సంచలన విషయాలు

హైదరాబాద్లో 16 ఏళ్ల బాలికపై <<19182426>>గ్యాంగ్ రేప్<<>> ఘటనలో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. 8వ తరగతి అమ్మాయి ఈ నెల 7న చార్మినార్లో షాపింగ్కు వెళ్లగా 16 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. ఈ నెల 16న స్కూల్కు వెళ్తున్నానని చెప్పి అతడిని కలిసింది. అతడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెకు మద్యం తాగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించారు. ఇద్దరిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు.
News February 20, 2026
4,000 నుంచి 550కి ఓలా స్టోర్లు

<<19145931>>మార్కెట్ వాటా<<>>తో పాటు డిమాండ్ తగ్గడంతో ఓలా ఎలక్ట్రిక్ తన ఫిజికల్ స్టోర్ల సంఖ్యను తగ్గించుకుంటోంది. గతంలో ఏకంగా 4,000 ఔట్లెట్లు ఉండగా మార్చి నాటికి 550కి తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 700 స్టోర్లు రన్ అవుతున్నాయి. సర్వీస్ క్వాలిటీని పెంచడం, ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ ‘బిజినెస్ రీసెట్’ చేపట్టింది. డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ ఆదాయం 55% తగ్గింది. నష్టాలు ₹487Crగా నమోదయ్యాయి.
News February 20, 2026
NZB: నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల ఆరాటం

మార్చి15లోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించడంతో ఆశావహుల్లో ఆరాటం మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అసంతృప్తులకు, రెబల్స్కు నామినేటెడ్ పోస్టులు, జిల్లా కమిటీల్లో పార్టీ పదవుల భర్తీలో ప్రాధాన్యం ఇస్తామన్న హామీలు, భరోసాను కల్పించారు. ఈ నేపథ్యంలో భర్తీ ప్రకటన వెలువడడంతో వారిలో ఆశలు మొదలయ్యాయి. కాగా DCCB ఛైర్మన్ పదవిని పురన్ రెడ్డికి ఖరారు చేసినట్లు సమాచారం.


