News January 25, 2025
సత్యసాయి: ‘ఆడబిడ్డలు పుట్టింటికి ప్రాణం.. మెట్టింటికి జీవం’

‘ఆడబిడ్డలు పుట్టింటికి ప్రాణం.. మెట్టింటికి జీవనం’ అని శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఫైరోజ్ బేగం అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ పరిధిలో సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు గౌరవప్రదమైన జీవితం, విద్య, ఉద్యోగ అవకాశాలు పొందడం వారి హక్కు అని తెలిపారు.
Similar News
News September 18, 2025
సిరిసిల్ల జిల్లాలో వర్షపాతం నమోదిలా..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు వర్షపాత నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. రుద్రంగి 2.3, చందుర్తి 13.8, వేములవాడ రూరల్ 22.2, బోయిన్పల్లి 14.9, వేములవాడ 16.6, సిరిసిల్ల 23.0, కొనరావుపేట 15.7, వీర్నపల్లి 11.0, ఎల్లారెడ్డిపేట 1.4, గంభీరావుపేట 26.9, ముస్తాబాద్ 5.4, తంగళ్లపల్లి 5.6, ఇల్లంతకుంటలో 11.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News September 18, 2025
మల్యాల: ఎస్ఆర్ఎస్పీ కాలువలో వృద్ధురాలి శవం

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన ఓ వృద్ధురాలి శవాన్ని మల్యాల మండలం నూకపల్లి బ్రిడ్జి వద్ద స్థానికులు గమనించారు. శవం మరింత ముందుకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి ఉంచారు. ఆమె నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన ప్రభావతిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
అఫ్జల్సాగర్లో గల్లంతు.. భీమలింగం బ్రిడ్జిపై లభ్యం

వలిగొండ (మం) సంగం భీమలింగం బ్రిడ్జిపై గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అఫ్జల్సాగర్ నాలాలో 4రోజుల క్రితం గల్లంతైన అర్జున్ మృతదేహంగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు.