News March 1, 2026

సత్యసాయి: ఆమెది హత్యా? ఆత్మహత్యా?

image

పుట్టపర్తిలోని పెడపల్లిలో వివాహిత చంద్రకళ (22) శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతి అనుమానస్పదంగా మారింది. అదనపు కట్నం కోసం భర్తే హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పుట్టపర్తి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు వర్షిత, మోక్షిత ఇరువురు పిల్లలు ఉన్నారు.

Similar News

News March 3, 2026

మరో ఐదు S-400 కొనేందుకు భారత్ ప్లాన్!

image

డిఫెన్స్ సిస్టమ్స్ బలోపేతంలో భాగంగా భారత్ రష్యా నుంచి మరో ఐదు S-400 స్క్వాడ్రన్లు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిని రక్షణ శాఖ త్వరలో ఆమోదించే అవకాశం ఉంది. S-400తో పాటు పలు మిసైళ్లను కొనుగోలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో S-400 కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2018లో ఐదు S-400 స్క్వాడ్రన్లను భారత్ ఆర్డర్ చేయగా ఇప్పటికి మూడే వచ్చాయి. మరో రెండు రావాల్సింది.

News March 3, 2026

కెనడాతో భారత్ ₹24వేలకోట్ల యురేనియం డీల్

image

అణుశక్తి కోసం భారత్ కెనడాతో ₹24వేలకోట్ల విలువైన యురేనియం డీల్ కుదుర్చుకుంది. ఆ దేశ ప్రధాని మెక్ కార్నీ భారత్‌ పర్యటనలో భాగంగా నిన్న దీనిని ఖరారు చేసుకుంది. దీంతో కెనడా ఇకపై భారత్‌కు యురేనియమ్‌ను సప్లై చేయనుంది. దేశంలో ఏటా 600 టన్నుల యురేనియం ఉత్పత్తి అవుతుండగా ఇండియాకు ప్రస్తుతం 1800 టన్నులు అవసరం. 2047 నాటికి భారత్ అణుశక్తి సామర్థ్యం 100 గిగావాట్లకు చేరాలన్న లక్ష్యానికి ఈ డీల్ ఉపయోగపడుతుంది.

News March 3, 2026

ఖమేనీ మృతిపై నిరసనలు.. చాహల్ పోస్ట్

image

దేశంలో ఖమేనీ మృతిపై పలు చోట్ల నిరసనలు జరగడంపై టీమ్ఇండియా క్రికెటర్ చాహల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘నువ్వు ఉంటున్న దేశాన్ని సపోర్ట్ చేయి లేదంటే నువ్వు సపోర్ట్ చేస్తున్న దేశానికి వెళ్లిపో’.. అనే క్యాప్షన్‌తో ఓ వ్యక్తి టీషర్ట్ ధరించిన ఫొటో తన X అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కాగా అంతకుముందు యాంకర్ రష్మీ సైతం ఈ ఆందోళనలు చేసే వారిని ఇరాన్ పంపించేయాలని ప్రధాని మోదీని కోరుతూ పోస్ట్ చేశారు.