News October 28, 2025
సత్యసాయి జయంతి వేడుకలకు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం

పుట్టపర్తి పట్టణంలో నవంబర్ 23న సత్యసాయి 100వ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ట్రస్టు సభ్యులు ఆహ్వాన పత్రిక అందించారు. మంగళవారం విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ RJ రత్నాకర్ మర్యాదపూర్వక కలిసి ఆయనను ఆహ్వానించారు. జయంతి వేడుకలకు పీఎంతో కలిసి హాజరవుతున్నట్లు ఆయన తెలిపారని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు.
Similar News
News October 29, 2025
జగిత్యాల: ST యువతకు ఉపాధి అవకాశాలు

తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఎస్టీ నిరుద్యోగ యువతీయువకులకు ఆన్లైన్ ద్వారా వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు జగిత్యాల జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కే.రాజ్కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లాలోని ఆసక్తిగల ఎస్టీ నిరుద్యోగులు https://deet.telangana.gov.in వెబ్ సైట్లో నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
News October 29, 2025
టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

◆ బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన పర్మినెంట్ ఉద్యోగులకు ₹15,400, కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ₹7,535 చొప్పున బహుమానం.. తిరుమల, తిరుపతి సిబ్బందికి అదనంగా 10%
◆ గోశాలల నిర్వహణకు నిపుణుల కమిటీ ఏర్పాటు.. నివేదిక ఆధారంగా సంస్కరణలు
◆ కొనుగోలు విభాగంలో అవకతవకలపై ACBతో విచారణ
◆ కాణిపాకం ఆలయం వద్ద ₹25Crతో యాత్రికుల వసతి సముదాయం, వివాహ హాల్స్ నిర్మాణానికి ఆమోదం
News October 29, 2025
సిద్దిపేట: ‘దరఖాస్తు తేదీ పొడిగింపు’

2025-2026 విద్యా సంవత్సరానికి మైనారిటీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు తేదీ పొడిగించినట్లు సిద్దిపేట జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అహ్మద్ తెలిపారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కళాశాలలు, విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిసెంబర్ 31 వరకు గడువు పొడగించామని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలన్నారు.


